HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Ycp Special Operation On East Godavari District

TDP-YCP : గోదావరిపై టీడీపీ, వైసీపీ ఆపరేషన్ షురూ..!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి.

  • Author : Prasad Date : 07-09-2022 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP YCP
TDP YCP

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్, మండపేట, నియోజకవర్గాల్లో ఫ్యానుగాలికి తట్టుకొని టీడీపీ నిలబడింది. మిగతా చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఓడిన సీట్లపై దృష్టి సారించిన సీఎం జగన్

రాష్ట్రంలో ఓడిపోయిన 24 అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్ పెంచారు. దీనిలో ముందు వరుసలలో రాజమండ్రి అర్భన్, రూరల్ సీట్లు ఉన్నాయి. గతంలో ఎమెల్యేగా పోటీ చేసిన నేతలతో మరికొన్ని రోజుల్లో భేటీ కానున్నారు. గత కొంత కాలంగా రాజమండ్రి అర్భన్ ప్రాంతానికి సరైన నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ముగ్గురు సమన్వయకర్తలను మార్చింది వైసీపీ. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్భన్‌లో వైసీపీ జెండాను ఎగురవేయడం కష్టమని కార్యకర్తలు బాహాటంగా చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పరిధిలోని రెండు స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. బలమైన నాయకుడి కోసం వేట మొదలు పెట్టింది.

మండపేటలో మంటలు పెడుతున్న వేగుళ్ల

ఇక మండపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వానిక కొరకురాని కొయ్యగా మారారు. ఏ చిన్న సమస్యనైనా భూతద్దంలో చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ స్థానాన్ని తోట త్రిమూర్తులు సంపాదించారు. ఆయన మండపేట వైసీపీ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన నియోజకవర్గంలోని పర్యటిస్తున్నారు. టిడ్కో ఇళ్లు, రహదారుల విషయంలో ఎమ్మెల్సీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పేదలకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. దీంతో ప్రభుత్వం ఫలానా తేదీలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ప్రకటించింది. అలాగే రహదారుల అధ్వాన్న పరిస్థితులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సవాళ్లు విసిరారు.దీంతో వైసీపీ నేతలు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

నేతలకు చంద్రబాబు క్లాస్

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతం గురించి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేతలు ఎప్పటికిప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా నేతలు ప్రచారాలు చేసుకొవాలని సూచించారు. అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను త్యాగాలు చేసేందుకు సిద్ధమవ్వాలనే సంకేతాలను అధినేత పంపినట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • Andhrapradesh
  • chandrababu
  • cm jagan
  • East Godavari district
  • Mandapeta
  • Rajamahendravaram
  • tdp
  • telugudesam party
  • ysrcp

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Apsrtc

    APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd