TDP MLA’s : చంద్రబాబుని నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తాం – టీడీపీ ఎమ్మెల్యేలు
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ధోషిగా బయటికి వస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో
- By Prasad Published Date - 05:57 PM, Fri - 22 September 23
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ధోషిగా బయటికి వస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరుపున హైకోర్టులో వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కేసులో యాక్ట్ 17 (ఏ) వర్తిస్తుందని చెప్పి, చంద్రబాబు విషయంలో అది వర్తించదని చెప్పడం చూస్తే భారతదేశంలో తీర్పుతీర్పులకు మార్పులు ఎలా ఉంటాయనే సందేహం ప్రజలకు కలుగు తోందన్నారు. హైకోర్ట్ జడ్జిమెంట్ లోని పేజీ నెం -5 లో 2014-15 నుంచి 2018-19 వరకు సీఐడీ విచారణ జరిగిందని చెప్పారు. పేజీనెం-29లో ఈ కేసు విచారణ 2015 నుంచి అని మెన్షన్ చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
అవకతవకలు 2019 మార్చి వరకు జరిగాయని ఫిర్యాదుదారు, ఫోరెన్సిక్ ఆడిట్ వారు చెప్పారని.. అలాంటప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి 17 (ఏ) యాక్ట్ వర్తిస్తుందని మేము భావిస్తున్నామని తెలిపారు. ఈ కేసువిచారణలో న్యాయమూర్తులు సరైన ధృక్ఫథంలో ఆలోచించలేదన్నది తమ అభిప్రాయమని.. కాబట్టి ఈ కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పులపై తాము ఉన్నత న్యాయ స్థానా లను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నామన్నారు. న్యాయస్థానాల్లో చంద్రబాబును నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై అక్రమ కేసు పెట్టి, ఆయన్ని దోషిగా చిత్రీకరించ డానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించకుండా, తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా వందలమంది మార్షల్స్ సాయంతో సభను నడపాలని ప్రయత్నించారని.. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాపై తిట్లదండకం మొదలుపెట్టి, దౌర్జన్యకాండకు దిగారు. ఒక కల్పిత కేసుతో చంద్రబాబుపై బురదజల్లడానికి ఈ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందన్నారు.
Related News
Chandrababu : అమెరికాలో చంద్రబాబు.. ఆయన అడ్రస్ కోసం వెతుకుతున్న తెలుగువారు
ఉక్కపోతలో ఎన్నికల ప్రచార షెడ్యూల్లలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తి కావడంతో, అన్ని రాజకీయ నేతల నాయకులు తమ తీవ్రమైన షెడ్యూల్ల నుండి చాలా అవసరమైన విరామం తీసుకున్నారు.