HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Pattabhi Comments On Cm Jagan

TDP : జ‌గ‌న్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని

  • Author : Prasad Date : 18-01-2024 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర బృందం గానీ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సాధారణంగా ముఖ్యమంత్రులు వారివారి రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడం కోసం అధికారిక పర్యటనలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క పర్యటనలో పాల్గొనలేదని ఆయ‌న ఆరోపించారు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఆకర్షించడం కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అతి ముఖ్యమైనదని.. ప్రపంచ వ్యాప్తంగా సదస్సుకు విచ్చేసే పెట్టుబడిదారులకు తమ తమ దేశాలలోని వ్యాపార అవకాశాలను వివరించి వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారని ప‌ట్టాభి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ దేశాలను, రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తహతహలాడుతారని.. దావోస్ సదస్సును ఎంతోప్రతిష్టాత్మకంగా తీసుకుని పెట్టుబడులు ఆకర్షించడం కోసం శాయశక్తుల పనిచేస్తారన్నారు.1995-2004, 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా అనేకమార్లు దావోస్ సదస్సులకు వెళ్లి అక్కడ ఏపీకి ప్రత్యేకంగా ఒక పవీలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడులు ఆర్షించేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. కానీ, తెలుగు ప్రజలు దురదృష్టం గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ ఏడాది మినహాయిస్తే దావోస్‌లో జరిగిన నాలుగు సదస్సులకు గాను మూడింటికి జగన్ రెడ్డి డుమ్మా కొట్టార‌న్నారు. సదస్సుకు హాజరైన ఏడాది కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే చిత్తశుద్ది ఆయనలో ఎక్కడా కనిపించలేదన్నారు. అదేదో ఒక విహారయాత్రలా సరదాగా వెళ్లి తిరిగి వచ్చారని.. గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింద‌న్నారు.

Also Read:  Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగ‌వీటీ రాధ‌

జగన్ మోహ‌న్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగేళ్లు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగితే మూడుసార్లు డుమ్మా కొట్డాడు. దావోస్ సదస్సులకు జగన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి ఉంద‌న్నారు. వెళ్లిన ఒక్క ఏడాది కూడా కొన్ని కోట్ల రూపాయలు తగలేసి దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ వెళ్లారని ఆరోపించారు. దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ ఎందుకు వెళ్లాల్సివచ్చిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. దావోస్ పర్యటనలో ఏ ఒక్క విదేశీ కంపెనీ సీఈఓ కూడా జగన్ రెడ్డి ముఖం చూసిన పాపాన పోలేదన్నారు. జగన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన లబ్ది ఏమిటని అడిగితే వైకాపా మంత్రులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • Davos Summit
  • tdp
  • ysrcp

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Lokesh Tdp Office

    మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్

Latest News

  • అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

Trending News

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd