Tadisetty Brothers Quit Ysrcp : గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ
- By Sudheer Published Date - 11:56 AM, Tue - 20 February 24
అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టికెట్ దక్కలేదని చెప్పి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఈ తరుణంలో గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాడిశెట్టి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ మేయర్ తాడిశెట్టి మురళి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ప్రభుత్వంలో కష్టపడిన వారికి ఆదరణ లేదని, ఆయన సామాజిక వర్గం వారికే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. బీసీ వర్గాలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని.. త్వరలో తమ భవిష్యత్ కార్యచరణ తెలియజేస్తామన్నారు. జగన్ అధికారంలోకి రావటానికి కృషి చేసిన బీసీ వర్గాలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం కోసం ఎంతో కృషి చేశామని మాజీ మేయర్ తాడిశెట్టి మురళి తెలిపారు. జగన్ సముచిత స్థానం కల్పిస్తానని పలుమార్లు మాట ఇచ్చి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ సోదరులు ఏ పార్టీ లో చేరతారనేది చర్చ గా మారింది. కొంతమంది టీడీపీ లో చేరుతారని అంటుంటే..మరికొంతమంది జనసేన లో చేరతారని అంటున్నారు.
Read Also :Kawasaki Ninja: కవాసకి నింజా 500 టీజర్ విడుదల.. త్వరలో మార్కెట్లోకి లాంచ్..!
Tags
Related News
AP : వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పంచిన చీరలను మోహన విసిరికొట్టిన మహిళలు
దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు