HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Srisailam Dam Needs Immediate Repairs

శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం

  • Author : Vamsi Chowdary Korata Date : 21-01-2026 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam Dam
Srisailam Dam

Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్‌పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం జల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

  • శ్రీశైలం డ్యామ్ మరమ్మతు పనుల్లో కదలిక
  • టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ
  • ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన సిఫార్సులు

ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతు పనులకు మోక్షం లభిచింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), ఏపీ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ). సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజనీర్‌ (డిజైన్స్‌) వివేక్‌ త్రిపాఠి అధ్యక్షతన ఈ టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సోమేశ్‌ కుమార్‌, సుమంత్‌, అరుణ్‌ ప్రతాప్‌, మధుకాంత్‌ గోయల్‌ (జల సంఘం), మనీశ్‌ గుప్తా (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), ఎంకే వర్మ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), శైలేంద్ర సింగ్‌ (జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా), శ్రీశైలం డ్యాం చీఫ్‌ ఇంజనీర్‌ సభ్యులుగా నియమించింది. కాగా, తమ సభ్యుల పేర్లు కూడా వెల్లడించాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డును సీడబ్ల్యూసీ కోరింది. ఈ బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై అధ్యయనం చేయనుంది.

శ్రీశైలం డ్యామ్‌తో పాటు ప్లంజ్‌పూల్ మరమ్మతు అంశం ఆరేడేళ్లుగా మగ్గుతూ వస్తోంది. నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కూడా కాగితాలకే పరిమితం అయ్యాయి. శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ఆఫ్రాన్, ప్లంజ్‌పూల్ దెబ్బతినడంతో డ్యామ్ భద్రతకే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం డ్యామ్‌ను పరిశీలించింది. ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం డ్యామ్‌, ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై తీసుకోవాల్సిన చర్యలపై 2025 మేలో సిఫార్సులు చేసింది.

ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం.. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న ఆప్రాన్‌ నుంచి నుంచి 50- 220 మీటర్ల వరకు గుంత ఏర్పడింది. అంతేకాకుండా ప్లంజ్‌పూల్‌లో లోతు 122 మీటర్ల నుంచి 160 మీటర్ల వరకు ఉంది. ఇది ఇలాగే ఉంటే డ్యామ్ స్పిల్ వే దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. అలా జరగకుండా ఉండాలంటే.. స్పిల్‌వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో ఒకటి నుంచి 39 వరకు మార్చాలని చెప్పింది. ఇక 8వ బ్లాక్‌ నుంచి 12వ బ్లాక్‌ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్‌ చేయాలని సూచించింది. అయితే ఈ సూచనలన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు, ప్లంజ్‌పూల్‌కు ఏ మేర నష్టం జరిగింది అని నిపుణుల బృందం అంచనా వేయనుంది. సాంకేతిక సమీక్ష నిర్వహించి.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డ్యామేజీలపై కేస్ స్టడీలను అధ్యయం చేస్తుంది. వాటిని పరిగణలోకి తీసుకుని.. అవసరమైన డ్రాయింగ్స్, డిజైన్స్ ఇవ్వనుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • central Water Commission
  • Repairs
  • srisailam dam
  • Technical Team
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd