HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raghul Gandhi Will Visit To Vizag Soon

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

  • Author : Balu J Date : 07-10-2021 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీ ఇప్పటికే తన మద్దతును అందించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేశారని, కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వాటిని కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకించే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు.

రాష్ర్ట సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నిధులు మంజూరు చేస్తుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటుందని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్‌షిప్‌లను చెల్లించలేదని. వచ్చేనెలా  1 లోపు విద్యార్థుల ఖాతాల్లో నిధులను జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని నియమించి తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటం వల్లే జగన్ నేడు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ తోనే ఏపీ కి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని చింతా మోహన్ అన్నారు.

కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుండటంతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం, మాజీ ఎమ్.పి డా. కే. వి. పి. రామచంద్ర రావు, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు లాంటి నేతలతో  కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని నియమించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chinta mohan
  • comments
  • congress
  • politics
  • rahul gandhi
  • steel plant
  • vizag

Related News

Congress ranks call for movement in wake of National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd