HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Political Ball In Ycp Court Will It Demand Special Status To Andhra Before President Election

YSRCP Politics: వైసీపీ కోర్టులో పొలిటికల్ బాల్.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తెస్తుందా?

అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది.

  • Author : Hashtag U Date : 19-06-2022 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Before Election
Jagan Modi

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఉండగా నాటి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అనేక అంశాలపై నిలదీసేవారు. కానీ ఇప్పుడు అవే అంశాల విషయంలో మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, ఉద్యోగాలు, సీపీఎస్ రద్దు.. ఇవే కాదు చాలా అంశాలపై మౌనమే సమాధానంగా మారుతోంది. అదేమంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది.. అలాంటప్పుడు గట్టిగా డిమాండ్ చేయలేం.. అందుకే అడుగుతూ ఉందామనే ధోరణినే కనబరుస్తోంది. ఆ పార్టీ నేతల మాటలూ అలానే ఉన్నాయి. మరి ఇలా అయితే ఏపీ అభివృద్ధి ఎలా? అందుకే ఇప్పుడు బాల్ ఏపీలో అధికారంలో ఉన్న వైపీసీ కోర్టులోకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం. దానిని అడ్డం పెట్టుకుని.. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతికి, పోలవరానికి నిధులు కావాలని డిమాండ్ చేయచ్చు. మరి జగన్ అలా చేస్తారా?

25కి 25 ఎంపీ సీట్లలోనూ తమను గెలిపిస్తే.. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా.. ఏపీకి హోదా ఇస్తేనే.. మద్దతిస్తాం అని గట్టిగా చెప్పారు జగన్. ఇప్పుడు ఆ డిమాండ్ ను గట్టిగా అడగడానికి మంచి అవకాశం వచ్చింది. తెలుగువారికి ప్రత్యేక హోదాయే సంజీవని అని, ఆ హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, పన్ను రాయితీలు లభిస్తాయని, ఉద్యోగాలు వచ్చేస్తాయని జగన్ చెప్పారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్సే ప్రాణవాయువన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని.. దానిపై పోరాడాలని అన్నారు. మరిప్పుడు దానికోసం పోరాటం ఏది? పైగా వైసీపీకి లోక్ సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలున్నారు. అయినా ఆ నేతలు కేంద్రంపై పోరు బాట పట్టలేదు.

జగన్ సీఎం అయ్యాక.. ఈ మూడేళ్లలో సుమారు 15 సార్లయినా ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటాలు ఏవి? వాటిలో ఎన్నింటిని సాధించారు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. అమరావతిని ఆధారంగా చేసుకుని.. లక్షల కోట్ల సంపదను సృష్టించి రాష్ట్రాన్ని బాగుచేద్దామనుకున్న తమ ఆశ, ఆశయం నాశనం అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే ఆవేదన చెందుతున్నారు. మరి దానికి జగన్ సమాధానం ఏమిటి?

అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది. అప్పటి రేటు ప్రకారం చూస్తే.. చదరపు గజం ధర సుమారు రూ.25 వేలు. అంటే రైతుల దగ్గరున్న స్థలాల విలువ దాదాపు రూ.1,25,000 కోట్లు. కానీ ఇప్పుడు దానిలో నాలుగోవంతు రేటు కూడా రావట్లేదు. అంటే సుమారుగా 90 వేల కోట్ల రూపాయిల సంపద గోవిందా! అని టీడీపీ ఆరోపిస్తోంది. అప్పట్లో సీఆర్డీఏ దగ్గర దాదాపు 10 వేల ఎకరాల స్థలం ఉండేది. ఒకవేళ అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే.. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎకరం ధర ఎలా లేదన్నా సుమారు రూ.10 కోట్లయినా ఉండేదని టీడీపీ చెబుతోంది. అంటే ఆ లెక్కన చూసినా.. ఆ భూమి విలువ రూ.లక్ష కోట్ల పైనే ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువా పోయినట్టే అని విమర్శిస్తోంది.

ఏపీలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలోనూ డెడ్ లైన్లు మారుతూ ఉన్నాయి. 2021 చివరినాటికి పూర్తి చేస్తామని చెప్పినా అది సాధ్యం కాలేదు. తరువాత 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ గడువులోగా పూర్తవ్వడమూ కష్టమే. అందుకే ఇప్పుడేమో.. అసలు ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి డెడ్ లైనూ లేదు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటోంది ప్రభుత్వం. ఇక సీపీఎస్ ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే రద్దు చేస్తామని చెప్పింది. కానీ తరువాత మాట మారింది. చివరకు దానిపై అవగాహన లేక ఆనాడు జగన్ హామీ ఇచ్చారు అని ప్రభుత్వం చెప్పింది. అంటే ఇది మాట తప్పడం కాదా.. మడమ తిప్పడం కాదా అని అని టీడీపీ ప్రశ్నిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి.. రాష్ట్రానికి రావలసిన నిధులను రప్పించాలని, అభివృద్ధిని పరుగులు పెట్టించాలని విపక్షాలు కోరుతున్నాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • bjp
  • jagan mohan reddy
  • Presidential polls
  • special status
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd