HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Ap Projects Visakhapatnam Tirupati Development

Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఆశ ఫలించేనా..

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.

  • Author : Kavya Krishna Date : 08-01-2025 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Narendra Modi, Vizag Steel Plant
Narendra Modi, Vizag Steel Plant

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. విశాఖపట్నంలో జరిగే ఈ పర్యటనలో ప్రధానంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్: అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతోన్న ఈ హబ్‌ పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయనున్నారు. సముద్రపు నీటిని డీసాలినేషన్ ద్వారా శుద్ధి చేసి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

బల్క్‌ డ్రగ్‌ పార్క్: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీని ద్వారా 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అంచనా వేస్తున్నారు. 28 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

రైల్వే ప్రాజెక్టులు: చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్‌ రహదారి. నాగార్జునసాగర్‌-దావులపల్లి ద్విరేక రహదారి విస్తరణ. గుడివాడ-మచిలీపట్నం రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు. భీమవరం-నిడదవోలు రైల్వే డబ్లింగ్‌. గుత్తి-ధర్మవరం రైల్వే లైన్‌ డబ్లింగ్‌.

తిరుపతి క్రిస్‌సిటీ: తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌, ఆటో, ఫార్మా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే 37 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగనుంది.

ఇతర ప్రాజెక్టులు:

  • ఆదోని-బైపాస్‌ రోడ్డు విస్తరణ.
  • దోర్నాల-కుంట జంక్షన్‌ మార్గ విస్తరణ.
  • సంగమేశ్వరం-నల్లకాలువ రహదారి.

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఈ పర్యటనలో ప్రధానమంత్రి కీలక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. విశాఖ వేదికగా మోదీ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వగలరని పరిశీలకులు ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రకటితమయ్యే ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి పునాది వేస్తాయని భావిస్తున్నారు.

Shafali Verma: అండ‌ర్‌-19 ఆడ‌టం గొప్ప అవ‌కాశం: ష‌ఫాలీ వ‌ర్మ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bulk Drug Park
  • employment opportunities
  • infrastructure development
  • Investments
  • NTPC Green Hydrogen Hub
  • pm modi
  • Railways
  • Tirupati
  • Visakhapatnam

Related News

India's Highway

జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

Economic Survey 2026  భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ‌ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విష

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • India vs New Zealand

    న్యూజిలాండ్ భారీ స్కోర్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్

  • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

  • పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!

  • టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్‌.. భ‌ద్ర‌త అంతంత మాత్ర‌మే!

  • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd