HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Pm Modi Ap Projects Visakhapatnam Tirupati Development

Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఆశ ఫలించేనా..

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.

  • By Kavya Krishna Published Date - 10:02 AM, Wed - 8 January 25
  • daily-hunt
Narendra Modi, Vizag Steel Plant
Narendra Modi, Vizag Steel Plant

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. విశాఖపట్నంలో జరిగే ఈ పర్యటనలో ప్రధానంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్: అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతోన్న ఈ హబ్‌ పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయనున్నారు. సముద్రపు నీటిని డీసాలినేషన్ ద్వారా శుద్ధి చేసి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

బల్క్‌ డ్రగ్‌ పార్క్: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీని ద్వారా 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అంచనా వేస్తున్నారు. 28 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

రైల్వే ప్రాజెక్టులు: చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్‌ రహదారి. నాగార్జునసాగర్‌-దావులపల్లి ద్విరేక రహదారి విస్తరణ. గుడివాడ-మచిలీపట్నం రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు. భీమవరం-నిడదవోలు రైల్వే డబ్లింగ్‌. గుత్తి-ధర్మవరం రైల్వే లైన్‌ డబ్లింగ్‌.

తిరుపతి క్రిస్‌సిటీ: తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌, ఆటో, ఫార్మా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే 37 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగనుంది.

ఇతర ప్రాజెక్టులు:

  • ఆదోని-బైపాస్‌ రోడ్డు విస్తరణ.
  • దోర్నాల-కుంట జంక్షన్‌ మార్గ విస్తరణ.
  • సంగమేశ్వరం-నల్లకాలువ రహదారి.

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఈ పర్యటనలో ప్రధానమంత్రి కీలక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. విశాఖ వేదికగా మోదీ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వగలరని పరిశీలకులు ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రకటితమయ్యే ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి పునాది వేస్తాయని భావిస్తున్నారు.

Shafali Verma: అండ‌ర్‌-19 ఆడ‌టం గొప్ప అవ‌కాశం: ష‌ఫాలీ వ‌ర్మ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bulk Drug Park
  • employment opportunities
  • infrastructure development
  • Investments
  • NTPC Green Hydrogen Hub
  • pm modi
  • Railways
  • Tirupati
  • Visakhapatnam

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

    AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd