HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >People First Is Our Policy Chandrababu

‘People first’ – Chandrababu : ‘పీపుల్ ఫస్ట్’ మన విధానం – చంద్రబాబు

'People first' - Chandrababu : ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని , ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 11-12-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'people First' Is Our Polic
'people First' Is Our Polic

రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ (People first) అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని సీఎం చంద్రబాబు (CM CHandrababu) జిల్లాల కలెక్లర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని , ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతుల వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధామ్యాలుగా ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైనా, భవిష్యత్ ప్రణాళికలపైనా చర్చించారు. గత ప్రభుత్వానికి సంబంధించి రూ. 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లడమే కాకుండా, రాష్ట్ర నిధులను ముందుగానే వినియోగించడంతో ఏర్పడిన ఆర్థిక సమస్యలను అధిగమించామని అన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

మాఫియాలను నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం :

గత ప్రభుత్వ హయాంలో వ్యాపించిన భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు వంటి నేరాలను తుదముట్టించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కూకటి వేళ్లతో సహా ఇలాంటి అక్రమాలను నిర్మూలించి, రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకురావాలన్నారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెట్టుబడులు, ఐటీ అభివృద్ధికి ప్రాధాన్యత :

రాష్ట్రంలో పెట్టుబడుల రాక కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం వెల్లడించారు. డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ వంటి సదుపాయాలు విశాఖపట్నం రూపురేఖలను మార్చి, రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా నిలుస్తాయని తెలిపారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారాలు :

రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే 60% వినతులు భూ సమస్యల గురించి ఉండడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్‌ను తీసుకువచ్చామని సీఎం చెప్పారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో అధికారం తీరును మార్పు చేయాలని సూచించారు.

విజన్ 2047తో స్వర్ణాంధ్ర లక్ష్యం :

రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ప్రకటించామని, దీనిలో భాగంగా జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. 15% వృద్ధి రేటును సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతులు పూర్తిచేయడం వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని వెల్లడించారు.

Read Also : AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ.. మొదలైన కసరత్తు? రేసులో ఎవెరెవరంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'People first' is our policy
  • ap
  • chandrababu

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి – చంద్రబాబు సూచన

నిధుల కొరతను సాకుగా చూపి అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పాత పద్ధతుల్లోనే కాకుండా, 'క్రియేటివ్'గా (సృజనాత్మకతతో) ఆలోచించి సంక్షోభంలోనూ అవకాశాలను వెతకాలని

  • Ab Venkateswara Rao

    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?

  • Flight Charges Sankranti

    సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్

  • Record Level Of National Hi

    ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Latest News

  • మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ

  • SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్

  • భారత్ పై డయాబెటిస్ భారం !!

  • సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?

  • సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Trending News

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd