Andhra Pradesh
-
తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం
MK Stalin తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమ
Date : 02-03-2026 - 12:15 IST -
బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన పవన్
ఈ ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరామర్శించారు.
Date : 01-03-2026 - 10:11 IST -
తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం 'అరెస్టుల సెంటిమెంట్' అనే సరికొత్త అస్త్రాన్ని జగన్ ముందు ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, ఇది జగన్ ఇమేజ్ గ్రాఫ్ను పెంచుతుందని ఆయన ప్రత్యేక సర్వే రిపోర్టులతో జగన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 28-02-2026 - 8:09 IST -
పారిశ్రామిక హబ్గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్
ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఏర్పాటు చేయనున్న 'బ్లూ జెట్ హెల్త్కేర్' ఫార్మా యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు
Date : 28-02-2026 - 7:00 IST -
ఏపీ కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో, సాయిప్రసాద్ వంటి అనుభవజ్ఞుడైన అధికారి సిఎస్గా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జలవనరుల శాఖలో ఆయన అనుభవం, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Date : 28-02-2026 - 3:57 IST -
Explosion at Fireworks : ఏపీలో భారీ పేలుడు.. 18 మంది మృతి!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది
Date : 28-02-2026 - 3:44 IST -
Kajjikaya Police Complaint Issue : కజ్జికాయలు పెట్టలేదని అత్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన అల్లుడు
మామ తన ముగ్గురు అల్లుళ్లను పండుగకు పిలిచారు. అల్లుళ్లు వస్తున్నారని ఎంతో ఇష్టంగా ఇంట్లో 'కజ్జికాయలు' చేయించారు. అయితే, విందు వడ్డించే సమయంలో పెద్ద అల్లుడికి, రెండో అల్లుడికి కజ్జికాయలు పెట్టిన అత్తమామలు, మూడో అల్లుడిని (చిన్నల్లుడు) మర్చిపోయారు. ఇద్దరు అన్నలకు ఇచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవడంతో అది తన మర్యాదకు భంగం కలిగినట్లుగా
Date : 28-02-2026 - 1:30 IST -
Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించడం, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను తెప్పించినట్లు అధికారులు సీఎంకు వివరించారు
Date : 27-02-2026 - 9:00 IST -
Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు
Date : 25-02-2026 - 10:16 IST -
ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
Date : 24-02-2026 - 3:47 IST -
ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్
గతంలో విద్యాశాఖలో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంపొందించడం తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Date : 24-02-2026 - 2:49 IST -
వెంటనే లొంగిపోవాలి .. అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
Date : 24-02-2026 - 2:21 IST -
ఆర్టీసీ కార్మికులకు గుడ్న్యూస్ .. అదనంగా మరో 2 లక్షలు మంజూరు ..!
రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ .. EHS (ఎంప్లాయీస్ హెల్త్ సర్వీస్) కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఇప్పటికే అందుతున్న ₹2 లక్షల వైద్య సౌకర్యానికి మరో ₹2 లక్షలు అదనంగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు
Date : 24-02-2026 - 1:35 IST -
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు
ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని ఆరోపిస్తూ పలు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు చేయకపోతే తనను నేరస్థుడిగా ముద్ర వేస్తామని ఫిర్యాదుదారుడు బెదిరించాడని పేర్కొన్నారు.
Date : 24-02-2026 - 12:18 IST -
వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం
ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.
Date : 24-02-2026 - 9:15 IST -
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 23-02-2026 - 5:09 IST -
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్ర
Date : 23-02-2026 - 2:37 IST -
రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్
ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? అన్న విషయాలను పక్కా ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
Date : 23-02-2026 - 1:38 IST -
రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
MLA MLC sports ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పో
Date : 23-02-2026 - 1:16 IST