HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ours Is A People Government I Came To Listen To The Problems Of The People Cm Chandrababu

Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు

జగన్‌ 45 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.

  • By Latha Suma Published Date - 12:37 PM, Sat - 15 March 25
  • daily-hunt
Ours is a people government.. I came to listen to the problems of the people: CM Chandrababu
Ours is a people government.. I came to listen to the problems of the people: CM Chandrababu

Tanuk : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం తణుకు కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ పార్క్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Read Also: BRS : జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి : స్పీకర్‌కు బీఆర్‌ఎస్ విజ్ఞప్తి

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే మా ఏకైక లక్ష్యం. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లింది. అప్పు తీర్చడంతోపాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది. గత సీఎం కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదు. జగన్‌ 45 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.

రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ4 వేలకు పెంచాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాం. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇక, అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు.

Read Also: Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • People government
  • People problems
  • Swarnandhra
  • Tanuk
  • tdp
  • ysrcp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • CM Chandrababu

    Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • CM Chandrababu Naidu

    Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన

  • Made In India Products Chan

    Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd