HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ours Is A People Government I Came To Listen To The Problems Of The People Cm Chandrababu

Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు

జగన్‌ 45 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.

  • Author : Latha Suma Date : 15-03-2025 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ours is a people government.. I came to listen to the problems of the people: CM Chandrababu
Ours is a people government.. I came to listen to the problems of the people: CM Chandrababu

Tanuk : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం తణుకు కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ పార్క్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Read Also: BRS : జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి : స్పీకర్‌కు బీఆర్‌ఎస్ విజ్ఞప్తి

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే మా ఏకైక లక్ష్యం. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లింది. అప్పు తీర్చడంతోపాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది. గత సీఎం కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదు. జగన్‌ 45 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.

రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ4 వేలకు పెంచాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాం. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇక, అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు.

Read Also: Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • People government
  • People problems
  • Swarnandhra
  • Tanuk
  • tdp
  • ysrcp

Related News

    Latest News

    • సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

    • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

    • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

    • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd