HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Widow Pensions Sanctioned In Ap Rs 4 Thousand Per Month

Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు

ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.

  • By Latha Suma Published Date - 02:35 PM, Wed - 11 June 25
  • daily-hunt
New widow pensions sanctioned in AP..Rs. 4 thousand per month
New widow pensions sanctioned in AP..Rs. 4 thousand per month

Ntr Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 71,380 పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెల 12వ తేదీన, గురువారం, లబ్ధిదారులకు ఈ పింఛన్లను అధికారికంగా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది. సామాజిక భద్రతా చట్టం కింద ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలులో ఉన్నవారి కోసం ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం 71,380 మందిని అర్హులుగా గుర్తించి, వారికి మే నెల పింఛన్‌ రూ.4,000 చొప్పున జూన్ 12న ఇవ్వనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు లేదా పింఛన్‌ను ప్రత్యక్షంగా అందించనున్నారు. ఇప్పటికే ఈ పింఛన్ల మొత్తాన్ని సంబంధిత సచివాలయాల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి రూ.4,000 చొప్పున మొత్తం రూ.29.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ స్పౌజ్ పింఛన్ పొందడానికి లబ్ధిదారుల నుండి మరణ ధ్రువీకరణ పత్రం, భర్త పేరు, పింఛన్ వివరాలు, భార్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాయకులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు లాగిన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన చేసి అర్హత నిర్ణయించారు.

కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి వాటి వివరాలు..

.భార్యకు ముందే పింఛన్ ఉండటం
.హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో భార్యాభర్తలు వేర్వేరుగా ఉండటం
.మరణ ధ్రువపత్రం సమర్పించకపోవడం
.భార్యాభర్తలిద్దరూ మరణించటం
.దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం
.సాంకేతిక లోపాలు
.భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడం
.భార్య మళ్లీ వివాహం చేసుకోవడం వంటి కారణాలతో అనేక దరఖాస్తులను తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో తిరస్కరణకు గల కారణాలను అధికారికంగా వివరించారు. ప్రభుత్వం అందించిన ఈ స్పౌజ్ పింఛన్ పథకం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక భద్రత పొందనున్నాయి. ముఖ్యంగా భర్తను కోల్పోయిన గృహిణులకు ఇది ఎంతో మద్దతుగా నిలవనుంది. ఈ నెల 12వ తేదీ, గురువారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇందులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Read Also: Prisoners Exchange : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • New widow pensions
  • NTR Bharosa Pension Scheme
  • spouse
  • Spouse category

Related News

Lokesh supports National Education Policy

Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

Mega DSC : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt) విద్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలో ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కలిగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

  • Nara Lokesh Skill Census Vs

    Local Elections : స్థానిక ఎన్నికలకు సిద్ధం – మంత్రి లోకేశ్

  • Bonda Pawan

    Bonda Uma vs Pawan Kalyan : అంబటికి ఛాన్స్ ఇస్తున్న జనసేన శ్రేణులు

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd