HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nature Belongs To All Of Us Environmental Protection Is Everyones Responsibility Cm Chandrababu

World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 05-06-2025 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nature belongs to all of us.. Environmental protection is everyone's responsibility: CM Chandrababu
Nature belongs to all of us.. Environmental protection is everyone's responsibility: CM Chandrababu

World Environment Day : ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది సమాజానికే చెందినదని, దానిని కాపాడటంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Weather : రుతుపవనాలకు అకాల విరామం.. సెగలు కక్కుతున్న సూరీడు.. కారణం ఇదే.!

ఆరోగ్యవంతమైన పరిసరాలున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుందన్న నమ్మకంతోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వచ్ఛాంధ్ర’గా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. చెత్తను ఇంధనంగా మలచే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తూ, ప్రకృతి సంరక్షణ వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన” ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా పెరిగింది. ఇది మన ఆరోగ్యానికే కాదు, భూమికి కూడా ముప్పు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యత తీసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక వ్యక్తిగత సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు, ప్రకృతి రక్షణే భవిష్యత్ రక్షణ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొక్కలు నాటి ఈ ఉద్యమానికి నాంది పలికే కార్యక్రమంగా ఇది మారనుంది. పర్యావరణ పరిరక్షణపై సీఎం తీసుకుంటున్న చర్యలు నేటి తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం కలిగేలా ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొక్కల నాటకం, ప్లాస్టిక్ రహిత జీవితం, మరియు సురక్షిత వాతావరణం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు సమాజంలోని ప్రతివ్యక్తిలో చైతన్యం రేకెత్తించేలా ఉన్నాయి.

Read Also: Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Plantation drive
  • Plastic pollution
  • Swachh Andhra
  • swachh bharat
  • Van Mahotsav
  • World Environment Day

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd