HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokesh Makes Key Changes In The Education Department

Anniversaries : లోకేష్‌ మార్క్..విద్యాశాఖలో కీలక సంస్కరణలు..!!

విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. చదువులో ముందున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ఈ మార్పుల గురించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి అధికారులు నిర్ణయించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేశారు.

  • Author : Latha Suma Date : 22-03-2025 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Anniversaries : ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 27న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. చదువులో ముందున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ఈ మార్పుల గురించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి అధికారులు నిర్ణయించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేశారు. 9,10 తరగతుల స్టూడెంట్స్‌కు AI, కోడింగ్ లాంటి ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు బోధిస్తారు. ఆరో తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల తర్వాత కొన్ని రోజులు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు.

Read Also: Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల

కీలక నిర్ణయాలు..

ఇందులో భాగంగా ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే నిర్వహించనున్నారు. ఆ రోజు విద్యార్థులు పుస్తకాలు సంచులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తి చేసి, తర్వాత పదో తరగతి సిలబస్‌కు సంబంధింతి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్‌ను నవంబర్‌ను నెలాఖరు నాటికి పూర్తి చేసి డిసెంబరు 5 నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ప్రీఫైనల్‌ ఫిబ్రవరి 9-19, గ్రాండ్‌ టెస్ట్‌ మార్చి 2-12వ తేదీ వరకు నిర్వహిస్తారు. పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే నాటికి ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

విద్యాశక్తి కార్యక్రమం కింద విద్యార్థులకు హైబ్రిడ్‌ లెర్నింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో వెనుకబడిన విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తారు. దీని కోసం ఐఐటీ మద్రాస్‌తో విద్యాశాఖ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఫార్మెటివ్‌-1, 2, 3, 4 పరీక్షలు ఆగస్టు 4-7, అక్టోబరు 13-16, వచ్చే ఏడాది జనవరి 5-8, ఫిబ్రవరి 9-12న నిర్వహిస్తారు. సమ్మెటివ్‌-1,2 పరీక్షలు నవంబరు 10-19, వచ్చే సంవత్సరం మార్చి 6-15 నుంచి ఉంటాయి. విద్యార్థుల్లో ఆంగ్ల భాష కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపొందించేందుకు మిషన్‌ ఇంగ్లిష్‌ ఫ్లూయన్సీ కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థులకు వైద్య విద్య,ఇంజినీరింగ్‌ చదువులు, APPSC, UPSC, బ్యాంకింగ్, ఇతర ఉద్యోగావకాశాలపై మెగా కెరీర్‌ గైడెన్స్‌ ప్రొగ్రామ్‌లు అమలు చేస్తారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్‌కు స్టూడెంట్‌ వెల్‌ బీయింగ్‌ ప్రోగ్రామ్‌ అమలు చేయనున్నారు.

Read Also: Bangladeshi Hand : నాగ్‌‌పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI
  • Anniversaries
  • Bridge course
  • Coding
  • Education Department
  • Games competitions
  • Minister Lokesh
  • students

Related News

Ai Jobs

AI Jobs : AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

IIT హైదరాబాద్లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు

    Latest News

    • బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

    • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

    • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

    • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

    • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

    Trending News

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd