HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kurasala Kannababu Was The Major Reason Behind The Dissolving Praja Rajyam Party In Congress

Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్

ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-04-2024 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Praja Rajyam party
Fbldtewveay0y3v

Praja Rajyam party: ప్రజారాజ్యం … మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 లో జరిగిన 294 అసెంబ్లీ సీట్లకు గానూ పీఆర్పీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే కేవలం అని కొట్టిపారేయలేం. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ లాంటి బలమైన పార్టీల మధ్య తొలి ఎన్నికల్లోనే 18 సీట్లను గెలుచుకోవడం గొప్ప విషయమే. అయితే అప్పుడున్న చిరంజీవి ఇమేజ్ కి సీఎం పీఠం ఖాయమన్నారు. దివంగత ఎన్టీఆర్ తర్వాత ఓ సినీ నటుడు పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగడం ఇది రెండవ సారి. అయితే పార్టీ ఓడిపోవడంతో చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరు ఆ రోజు పీఆర్పీని విలీనం చేసి ఉండకపోతే ఇప్పుడు ఏపీలో చక్రం తిప్పి ఉండేది. కానీ పార్టీ అనంతరం అనేక విమర్శలు ఎదుర్కొన్నారు చిరంజీవి. ఎమ్మెల్యేలను గాలికొదిలేశాడని. రాజకీయ లబ్ది కోసమే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే అప్పుడు పీఆర్పీ కాంగ్రెస్ లో విలీననానికి కారణం ఎవరో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు కాకినాడ రూరల్‌లో మహాకూటమి అభ్యర్థి పట్నం వెంకటేశ్వరరావు తరపున పవన్ ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కన్నబాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. 2008లో నేను పీఆర్పీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిని. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉండాలనే నిబద్ధతతో జీవితాంతం సమాజ సేవకే అంకితం కావాలన్నదే మా లక్ష్యం అని పవన్ అన్నారు.

We’re now on WhatsApp. Click to Join

కన్నబాబు అప్పట్లో పీఆర్పీ కార్యాలయానికి చెడిపోయిన స్కూటర్‌పై వచ్చేవాడు. కానీ ఇప్పుడాయన చాలా ఎత్తుకు ఎదిగాడని అన్నారు పవన్. రాజకీయ రంగంలో వ్యక్తులు ఎదగడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, ఇతరులను మోసం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవడం అభ్యంతరకరం అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్‌పీ రద్దుకు ప్రధాన కారణం కన్నబాబు అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాగా కన్నబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్‌ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

Also Read: Pawan Kalyan : జగన్ ను గద్దె దించేవరకు మీరు ఎన్నిహారతులు తీసినా ప్రయోజనం లేదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2009 Elections
  • andhra pradesh
  • AP Elections 2024
  • chiranjeevi
  • congress
  • kakinada
  • kurasala kannababu
  • Merging PRP
  • Pawan Kalyan
  • Praja Rajyam Party

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd