HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Janasenas Distance From Elections Tdps War On Bogus Polling Day

Elections in AP: ఎన్నికలకు జనసేన దూరం, బోగస్ పై టీడీపీ యుద్ధం, పోలింగ్ డే

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్...

  • Author : CS Rao Date : 13-03-2023 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena's Distance From Elections, Tdp's War On Bogus, Polling Day

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్ నాడి బయట పడే ఈ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ ఉన్నప్పటికీ కలిసి ప్రచారం చేసిన దాఖలా లేదు. బహుశా తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మాదిరిగా ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లోనూ ఉన్నాయని భావించాలి.

ఏపీలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల కోసం సోమవారం పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పట్టభద్ర నియోజకవర్గాల్లో మొత్తం 10 లక్షల 519 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్లు 55,842 మంది ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 3,059 మంది ఓటు వేయనున్నారు. మొత్తంగా 10,56,720 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు.

మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు..

వారి కోసం 1,538 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు అధికారులు. ఆయా నియోజకవర్గాల్లో 500 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముమ్మర బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో- ఇప్పటి వరకూ 77,48,010 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మద్యం సీసాలను సీజ్ చేశారు. 64 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 75 మంది అరెస్ట్ అయ్యారు. 7,380 లైసెన్స్డ్ ఆయుధాలు పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా 7,266 మంది బైండోవర్ కేసులు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ బోగస్ ఓట్ల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ, సీపీఎం పార్టీల నాయకులు బోగస్ ఓట్లపై ఎన్నికల అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదులన్నీ తిరుపతి అర్బన్ నుంచి అందినవే. మిగిలిన నియోజవర్గాల నుంచి ఎలాంటి బోగస్ ఓట్ల ఫిర్యాదులు ఎన్నికల అధికారులకు అందలేదు.

663 పేర్లు బోగస్ ఓట్లను గుర్తిస్తూ చంద్రబాబు ఇదివరకే ఎన్నికల అధికారులకు జాబితాను పంపించారు. ఇందులో 500 పేర్ల మీద ఇప్పటికే విచారణ చేసి, ఈసీకి నివేదికనుపంపించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే వారంతా అదే ప్రాంతానికి చెందిన వారేనని గుర్తించినట్లు పేర్కొన్నారు. అడ్రస్ లో లేని, చనిపోయిన వారికి సంబంధించి జాబితాను ఇప్పటికే పోలింగ్ స్టాఫ్ కి పంపామని వివరించారు.

బోగస్, నకిలీ ఓట్లను చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలవుతోందని, గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా ఈ తంతు నడిచిందని, పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతోందని, డిగ్రీ చదవనివారు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదైనట్లు టీడీపీ అధినేత చెప్పారు. కొందరు ఎన్నికల అధికారులు నకిలీ పత్రాలపై ఎటువంటి పరిశీలన జరపకుండానే ఆమోదం తెలిపారన్నారు. తిరుపతిలోని 44వ డివిజన్‌లో చికెన్‌ దుకాణం అడ్రస్‌తో 16 బోగస్‌ ఓట్లు నమోదు చేశారని, చాలా ప్రాంతాల్లో ఈ తరహాలోనే జరిగిందని తెలిపారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బోగస్‌ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ బోగస్, నకిలీ ఓట్లు ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని అక్రమాలను అడ్డుకోవాలని, బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి” అని లేఖలో సీఈసీని చంద్రబాబు కోరారు. మొత్తం మీద సెమీ ఫైనల్ జనసేన లేకుండా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పబ్లిక్ నాడీ తీయనుంది. వార్ వన్ సైడ్ గా కనిపిస్తే జనసేన రాజకీయానికి వీరమరణం తప్పదని వైసీపీ సరికొత్త స్లో గన్ వినిపిస్తుంది.

Also Read:  AP Budget: ఏపీ బడ్జెట్‌ రూ.2.6 లక్షల కోట్లు? 17న సభలోకి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Day
  • Distance
  • elections
  • Janasena
  • polling
  • tdp
  • ycp
  • ysrcp

Related News

Nagababu

Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

Nagababu : ఐదు, ఆరు ఏళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, తన దృష్టిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Botsa Satyanarayana Daughte

    YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

  • Yarlagadda Venkata Rao Loke

    Yarlagadda Venkata Rao : లోకేశ్ విదేశీ పర్యటనపై యార్లగడ్డ ప్రశంసలు, వైసీపీపై విమర్శలు

Latest News

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd