HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Jagan Kcr Strategy On Visakha Steel Next Machilipatnam Port

Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!

వారం క్రితమే విశాఖ స్టీల్ , మచిలీపట్నం ఓడరేవు విషయంలో కేసీఆర్ అండ్ జగన్ ఏమి చేయబోతున్నారో ''హాష్టాగ్ యూ ' సంచలన కథనాన్ని అందించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేసింది.

  • By CS Rao Published Date - 11:42 AM, Mon - 10 April 23
  • daily-hunt
Vizag steel
Jagan, Kcr Strategy On Visakha Steel! Next Machilipatnam Port!

Jagan & KCR on Vizag Steel : వారం క్రితమే విశాఖ స్టీల్, మచిలీపట్నం ఓడరేవు విషయంలో కేసీఆర్ అండ్ జగన్ ఏమి చేయబోతున్నారో ”హాష్టాగ్ యూ ‘ సంచలన కథనాన్ని అందించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. గత ఏడాది బిడ్డింగ్ కు జగన్ (Jagan) సర్కార్ రెడి అయింది. అటు కేసీఆర్ (KCR) ఇటు జగన్ ఒకే మాట మీద గత ఏడాది నుంచి ఉన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు చెబుతూనే బిడ్డింగ్ కు ఇద్దరు సిద్ధం  అయ్యారు. కేంద్రాన్ని నిలదీయకుండా స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు సిద్ధం కావటం కేసీఆర్ , జగన్ మధ్య ఉన్న వ్యాపార సఖ్యతను తెలియ చేస్తుంది.

ఫక్తు రాజకీయ పార్టీగా బీ ఆర్ ఎస్ , వైసీపీ ఉన్నాయని అందరికి తెలిసిందే. అంతే కాదు రాజకీయాల్లో వ్యాపారాన్ని కూడా జోడించిన పార్టీలుగా ప్రత్యర్థులు భావిస్తుంటారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల వాలకం కూడా అలాగే ఉంది. గతంలో మచిలీపట్నం ఓడరేవు లో షేర్ ను కేసీఆర్ సర్కార్ కోరింది. అందుకు జగన్ (Jagan) కూడా అప్పట్లో సానుకూల సంకేతాలు ఇచ్చారు. కానీ ఏపీ ప్రజలు చీదరించుకుంటారని ఒక అడుగు తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. ఇప్పడు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ తరువాత కేసీఆర్ (KCR) టార్గెట్ మచిలీపట్నమ్ ఓడరేవుగా ఉందని సర్వత్రా వినిపిస్తుంది.

తెలంగాణ లాగిస్టిక్ హబ్ గా మచిలీపట్నం పోర్ట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచన. సముద్ర తీరం తెలంగాణకు లేని లోటును మచిలీపట్నం ఓడరేవు వాటాను కొనుగోలు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ వేశారు. అందుకు జగన్ కూడా అంగీకారం ఇచ్చినట్టు తాడేపల్లి కోటలోని టాక్. ఇప్పడు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కేసీఆర్ (KCR) టార్గెట్ గా పెట్టుకున్నారు. అక్కడ విజయం సాధించడానికి జగన్ సర్కార్ కూడా మద్దతు ఇస్తుందని తెలుస్తుంది. ఏపీ ఆస్తుల మీద తెలంగాణలో పెత్తనం చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ హక్కుగా భావించే స్టీల్ ప్లాంట్, ఆ తరువాత మచిలీపట్నం ఓడరేవును కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇదంతా మోడీ, కేసీఆర్, జగన్ (Jagan) వేసిన అత్యంత మెగా ప్లాన్ గా పారిశ్రామిక వర్గాల్లోని చర్చ. ఆడాని, కేసీఆర్, జగన్ త్రయం మధ్య ఏదో ఏపీ ఆస్తుల మీద జరుగుతుందని ప్రచారం మొదలయింది.

ఉద్యమాలు చేస్తుండగానే విశాఖ ఉక్కును విక్రయించే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు వ్యూహాత్మక ప్లాన్ వేసి కార్మికుల మద్దతు తో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడిసరుకు సంబంధించి యాజమాన్యం నిర్వహిస్తున్న బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

విశాఖకు అధికారుల బృందం తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోసం వెంటనే విశాఖ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే వైజాగ్ వెళ్లనున్న బృందం.. యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల బహిరంగంగానే వ్యతిరేకించారు. బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. సరిగ్గా ఇక్కడే అసలు కోణాన్ని అమలు చేసే అడుగు కేసీఆర్ వేశారు. ఆ లోగుట్టును 10 రోజుల క్రితమే హాష్టాగ్ యూ బయట పెట్టింది.
మరోవైపు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న అవసరమైన పరిష్కార మార్గాలను వారు సూచించారు.

వాటిని ఆయన కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ నిన్న ఈ విషయమై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లు కనుక తెలంగాణ ప్రభుత్వ సొంతమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటచ్చొన్నది కేసీఆర్ అభిప్రాయం.

15తో ముగియనున్న గడువు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ రోజుకు కేసీఆర్ , జగన్ డ్రామా మొత్తం బయట పడుతుందని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం మీద జగన్ , కేసీఆర్ వేసిన పాచికలో విశాఖ స్టీల్ పడిపోతుంది. ఇక తరువాత మచిలీపట్నం వంతు మిగిలింది.

Also Read:  KCR: కేసీఆర్ ’24 గంటలు’ ఆఫర్ లోగుట్టు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • brs
  • jagan
  • kcr
  • steel
  • Visakhapatnam
  • vizag
  • ycp
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Ap Egg

    Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd