AP CM: మాకు సహకరించండి.. బ్యాంకర్లను కోరిన సీఎం జగన్
ప్రభుత్వం సంక్షేమ రంగంలో తీసుకువస్తున్న విప్తవాత్మక మార్పులకు తమ మద్దతు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
- By Hashtag U Published Date - 10:04 PM, Wed - 8 December 21
ప్రభుత్వం సంక్షేమ రంగంలో తీసుకువస్తున్న విప్తవాత్మక మార్పులకు తమ మద్దతు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్ 13.7% వృద్ధిని నమోదు చేసిందని… కానీ థర్డ్ వేవ్, ఓమిక్రాన్పై వేరియంట్ వ్యాప్తి ప్రచారం కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించిందని సీఎం జగన్ తెలిపారు. లేకపోతే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకునేదని…ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని బలోపేతం చేయడానికి బ్యాంకులు ప్రణాళికలను రూపొందించాలని ఆయన కోరారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వారు తమ ప్రాధాన్యతలను, ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన తెలిపారు.
ప్రైమరీ హెల్త్ సెక్టార్ లో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తోందని జగన్ తెలిపారు. ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తోందని… అలాగే, వైద్య, ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాని ఆయన పేర్కొన్నారు. దీనికి రూ.12,243 కోట్లు అవసరమని…. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.
వార్షిక క్రెడిట్ ప్లాన్ను ప్రస్తావిస్తూ…ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సాధించిన విజయాలకు సీఎం జగన్ బ్యాంకర్లను అభినందించారు. వ్యవసాయ టర్మ్ రుణాలు పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని… ఇంకా అందని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి కోరారు. కౌలు రైతులు రుణాలు పొందాలని, 4,240 రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని… ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు.
గృహనిర్మాణ పథకం కోసం మహిళలకు 3% వడ్డీకి రూ.35,000 రుణంగా అందించాలని…టిడ్కో గృహాలకు రుణాలు అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ బ్యాంకర్లను కోరారు. MSMEలకు సంబంధించి 8.3 లక్షల ఖాతాలు ఉన్నాయని, వాటిలో 1.78 లక్షల ఖాతాలను పునర్నిర్మించామని…MSMEల రుణ ఖాతాలను ఒకేసారి పునర్నిర్మించడానికి బ్యాంకులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. జగనన్న తోడు పథకం కింద 9.1 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని…దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ బ్యాంకులను కోరారు.
Tags
Related News
Weight Loss Drinks: ఈ సమ్మర్లో వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా..? అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!
బరువు పెరగడం, ఊబకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి.