HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Investments Of Rs 45 Thousand Crores With Singapore Visit Minister Nara Lokesh

Minister Lokesh: సింగపూర్‌ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్‌, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.

  • By Latha Suma Published Date - 07:12 PM, Thu - 31 July 25
  • daily-hunt
Investments of Rs. 45 thousand crores with Singapore visit: Minister Nara Lokesh
Investments of Rs. 45 thousand crores with Singapore visit: Minister Nara Lokesh

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో చేసిన పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ఈ పర్యటన ఫలితంగా ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్‌, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆర్సెలర్ మిత్తల్ సంస్థను Zoom కాల్‌ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించామని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు.

జగన్ పాలనలో ఏపీ బ్రాండ్‌కు నష్టం

2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసిందని విమర్శించారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ ప్రభుత్వం ప్రతిపాదించిందని, కానీ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ దేశంతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసిందని లోకేశ్‌ ఆరోపించారు. ప్రపంచంలో పారదర్శక పాలనలో ముందుండే సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం రాష్ట్ర ఖ్యాతిని దెబ్బతీసే పని అని అన్నారు.

పరిశ్రమల తరిమివేత.. ఐటీ అభివృద్ధికి కొత్త దిశ

అమర్‌రాజా, లులు గ్రూప్‌ వంటి ప్రముఖ సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేసిన ప్రభుత్వమే, పెట్టుబడుల రాకకు కారణమని లోకేశ్‌ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఐటీ అభివృద్ధికి విశాఖపట్నంను కేంద్రంగా చేసుకొని ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరుకు కర్ణాటక, చెన్నైకు తమిళనాడు లాగానే, విశాఖపట్నం AP ఐటీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

భూముల కేటాయింపుపై స్పష్టత

టీసీఎస్ సంస్థకు భూమి కేటాయింపుపై కూడా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్రం చేయని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమిని కేటాయించామని, దీనిపై వైసీపీ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. అయితే హెరిటేజ్‌ సంస్థకే తక్కువ ధరకు భూములు ఇవ్వని తమ ప్రభుత్వం, టీసీఎస్‌కు మాత్రం భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఇచ్చిందని అన్నారు. జీతాలు, ఉపాధి వస్తే అలాంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇవ్వడంలో తప్పేం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ కుట్రలు.. పెట్టుబడులకు అడ్డుపడే చర్యలు

పెట్టుబడులు రాకుండా వైకాపా మద్దతుదారులు విదేశాల్లోనూ కుట్రలు చేస్తున్నారని లోకేశ్‌ ఆరోపించారు. సింగపూర్‌ ప్రభుత్వ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా ఏపీలో ప్రభుత్వం మారనుందన్న సందేశం పంపారని చెప్పారు. అతడికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పెట్టుబడుల కోసం తమిళనాడులో రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తే, ఏపీలో మాత్రం పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి చలనలు చేస్తే నష్టపోయేది తెలుగువారే అని నారా లోకేశ్‌ అన్నారు.

Read Also: Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్‌కు గాయాలు

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 45 thousand crores
  • ap
  • CBN Singapore Tour
  • Investments
  • IT Development
  • Land allocations
  • Minister Nara lokesh

Related News

Lokesh supports National Education Policy

Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

Mega DSC : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt) విద్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలో ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కలిగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

  • Nara Lokesh Skill Census Vs

    Local Elections : స్థానిక ఎన్నికలకు సిద్ధం – మంత్రి లోకేశ్

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd