HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >If You Do These Three Things Ap Will Be Super Former Cbi Jd Lakshminarayana With Chandrababu

CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-11-2025 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jd Lakshmi Narayana
Jd Lakshmi Narayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాల సత్వర పరిష్కారం, పర్యావరణ అనుమతులు త్వరగా రావాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల ఉద్యోగాల అంచనాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో వచ్చిన పెట్టుబడులపై ట్వీట్ చేస్తూ.. ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ‘విశాఖపట్నంలో సీఐఐ భాగస్వా్మ్య సదస్సును విజయవంతంగా నిర్వహించి, పలు దేశ, విదేశీ సంస్థలతో కీలకమైన ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు. ఒప్పందాలు చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత వాటిని అమలు చేసినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఉండాలి. భూ వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. పర్యావరణానికి సంబంధించిన అనుమతులు సైతం త్వరగా రావాలి. అప్పుడే విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమలవుతాయి. అలా జరిగితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి’ అన్నారు.

Congratulations to @ncbn garu, @naralokesh garu and @SuchitraElla
garu for successfully hosting the CII Investment Summit in Visakhapatnam and signing several MoUs. The next big step is ensuring their grounding. A truly effective single-window clearance system, fast-tracking…

— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) November 16, 2025

విశాఖపట్నం సీఐఐ భాగస్వా్మ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సదస్సులో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ సదస్సులో మూడు రోజుల్లో 613 ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. 12 రంగాల్లో ఏకంగా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. అంతేకాదు 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్ తన డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో, ఇతర పెద్ద సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థలు ఒక్కొక్కటి 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇది విశాఖపట్నం యొక్క పారిశ్రామిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు.

పారిశ్రామికవేత్తలలో మరింత విశ్వాసాన్ని నింపడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా, నవంబర్ 14 మరియు 15 తేదీలలో, విశాఖపట్నంలోనే ఒక సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సు కోసం ప్రత్యేకంగా విశాఖ తీరంలో ‘ఆంధ్ర మండపం’ అనే పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. ఈ చర్యలు పెట్టుబడిదారులకు భరోసా కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • CII Summit Vizag
  • JD lakshmi narayana
  • naralokesh
  • THE CII PARTNERSHIP SUMMIT 2025
  • Visakhapatnam

Related News

Virat Kohli

Virat Kohli: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్‌..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!

భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్‌లో జరగనుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.

  • Ap Govt

    Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

  • Apsrtc

    APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

Latest News

  • Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తామా?

  • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

  • India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!

  • Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్‌.. అస‌లు ఎందుకీ స‌మ్మిట్‌, పూర్తి వివ‌రాలీవే!

Trending News

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

    • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

    • Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd