HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Help End Poverty Through P4 Andhra Pradesh Cm Chandrababu Naidu

CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్ర‌బాబు మ‌రో కీల‌క పిలుపు!

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.

  • Author : Gopichand Date : 19-07-2025 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) తన మనసుకు అత్యంత దగ్గరైన కార్యక్రమంగా “జీరో పావర్టీ పీ4″ను అభివర్ణించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ‘మార్గదర్శుల’కు సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో తన ఆలోచనలు, లక్ష్యాలను పంచుకున్నారు.

సీఎం ఆలోచనలు, లక్ష్యాలు

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది ‘బంగారు కుటుంబాలను’ మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అంబేద్కర్ నుండి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎవరో ఒకరి సాయం అందిందని గుర్తు చేశారు. సమాజంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలని సూచించారు. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఉదహరించారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నానని, ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల ‘బంగారు కుటుంబాలను’ గుర్తించామని, వారికి సాయం చేసేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read: Donald Trump: ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో 5 విమానాలు ధ్వంసమ‌య్యాయి: ట్రంప్‌

నాడు జన్మభూమి.. నేడు పీ4

47 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత సంస్కరణలు తీసుకువచ్చి, ఐటీ, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు అన్నారు. ఇవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, సంపద సృష్టించగలిగామని తెలిపారు. దీని ద్వారా సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని చెప్పారు. ‘జన్మభూమి’ వంటి కార్యక్రమం ద్వారా గతంలో అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేశామని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. పేదల భవిష్యత్ బంగారుమయం చేసేందుకు ‘పీ4’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు.

సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు, ఆశయాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదల కోసం ఇంతగా ఆలోచించిన నాయకుడిని గతంలో తామెప్పుడూ చూడలేదని కొనియాడారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap news
  • camp office
  • CM Chandrababu
  • P4 Programme

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

  • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

  • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

  • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd