HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gunturu West Ysrcp Leader Chandragiri Yesuratnam

YSRCP Gunturu West : చంద్రగిరి ఏసురత్నాన్ని ఇబ్బంది పెడుతున్న న‌లుగురు నేతలెవరూ..?

చంద్రగిరి ఏసురత్నం ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డుకు ఛైర్మన్...

  • Author : Prasad Date : 07-09-2022 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
gunturu west ysrcp
gunturu west ysrcp

చంద్రగిరి ఏసురత్నం ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డుకు ఛైర్మన్. డీఐజీగా సేవలందించిన ఆయన.. వాలంటీర్ రీటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పాపం రాజకీయం అనుభవం లేని ఏసురత్నాన్ని గుంటూరులోని నలుగురు నేతలు ఎంతో ఇబ్బంది పెట్టారు..ఇంకా పెడుతున్నారంటా. తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని త‌న స‌న్నిహితుల వ‌ద్ద ఏసుర‌త్నం వాపోతున్నారు.

వైసీపీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్

2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఆ తర్వాత నియోకవర్గంలో చంద్రగిరి ఏసురత్నానికి ప్రాధాన్యత తగ్గిందని ఆయన అనుచరులు వాపోతున్నారటా. దీనికి తోడు 2014 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల‌కు సంబంధించిన వివరాలను కొన్ని చెప్పలేదంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసురత్నం. ఇన్నాళ్లు శత్రువు పక్క పార్టీలో ఉన్నాడు అనుకుంటే.. మళ్లీ ఆయన వైసీపీలో చేరి తన పక్కనే కూర్చుంటూ.. తనకే వెన్నుపోటు పోడిచారని ఏసుర‌త్నం ఆవేదన చెందుతున్నారంటా.

నలుగురి నాశనం కోసం దేవుడికి పూజలు చేస్తున్నాను: ఏసురత్నం

దీనికి తోడు 2019 ఎన్నికల సమయంలో నలుగురు కీలక నేతలు తనను వెన్నుపోటు పొడిచారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఏసురత్నం. వారు వైసీపీలోనే ఉన్నారని.. వారిని ఏం చేయలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నట్లు వెల్లడించారు. ఆ నలుగురిని నాశనం చేయమని దేవుడికి ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నట్లు మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి తన బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారని వాపోయారు. బీసీ వడ్డెర కులానికి చెందిన తనను సీఎం జగన్ ఆదరించారన్నారు. ఆ తర్వాత మూడు పర్యాలుగా మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఇచ్చి ఆదరించారన్నారు. కానీ కొన్ని దుష్ట శక్తుల వల్ల ప్రజలకు మాత్రం దూరం కాలేదన్నారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఇంతకీ ఆ నలుగురు వ్యక్తులు ఎవరూ..?

పోలీసు అధికారిగా ఎంతో పేరు తెచ్చుకున్న చంద్రగిరి ఏసురత్నాన్ని ఇబ్బంది పెట్టిన ఆ నేతలు ఎవరనే దానిపై ఇప్పుడు గుంటూరులో చర్చ మొదలైంది. రాజకీయం తెలియదని ఆయన్ని మోసం చేశారనే కామెంట్లు ఇప్పుడు గుంటూరు మిర్చిలాగే ఘాటు పెంచుతున్నాయి. మొత్తానికి 2024 ఎన్నికల్లో సీఎం జగన్ పశ్చిమ నియోజకవర్గంలో ఓడిన ఏసురత్నానికి అవకాశం ఇస్తారా..? లేక పార్టీ మారిన మద్దాలి గిరికి అవకాశం ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • andhrapradesh politics
  • chandragiri yesuratnam
  • gunturu mirchi yard
  • Gunturu west
  • maddali giri
  • ysrcp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Andhra Pradesh Earthquake

    ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • Andhra Pradesh Logo

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Latest News

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd