Andhra Pradesh : అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల
- By Prasad Published Date - 11:35 AM, Sun - 21 January 24
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్ పాయింట్ల వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.. విధుల్లో చేరేందుకు అంగన్వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువిచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరినవారి, చేరనివారి వివరాలు తీసుకుంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్వాడీలు సమాధానమిచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా… ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది 10 శాతంలోపే. అంగన్వాడీలు సంఘటితంగా పోరాట ఉద్ధృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీలున్నారు.
Also Read: YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
Related News
Jagan : చండీయాగాన్ని పూర్తి చేసిన జగన్..మరోసారి సీఎం అయినట్లేనా..?
గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లి లోని తన ప్యాలెస్ లో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తూ వచ్చారు