HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News From The Government For Those In Ap Backlog Posts Are Being Filled

Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Government
Andhra Pradesh Government

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా్తంగా వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గతేడాది మార్చి 31తో ఈ గడువు ముగియగా.. తాజాగా దాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. అంటే పోస్టుల భర్తీకి కాలపరిమితి మరో ఏడాది పెంచారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక డ్రైవ్‌ చేపట్టాలని అన్ని శాఖల్ని ఆదేశించింది. ఈ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు. రిజర్వేషన్‌ నిబంధనలు, నియామక మార్గదర్శకాలకు కట్టుబడి భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టింది. ముగ్గురు మాజీ మున్సిపల్ కమిషనర్లు, 43 మంది ఇతర అధికారులపై అభియోగాలు నమోదు చేస్తూ 63 ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2019-24 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఉచిత అన్నదాన కేంద్రానికి స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించగా, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ కేసులో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్లుగా పనిచేసిన చంద్రమౌళీశ్వరరెడ్డి, రాధా, వెంకటరమణయ్య, పట్టణ ప్రణాళిక విభాగం సహాయక కమిషనర్ మునిరత్నం, ఇద్దరు విశ్రాంత అధికారులు, ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఎకౌంట్స్ సెక్షన్ సిబ్బంది, 24 మంది సచివాలయ వార్డు కార్యదర్శులు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి సిఫారసులు పంపిన విచారణ బృందం, ఈ అక్రమాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాలతో పురపాలక శాఖలో అలజడి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • Backlog posts
  • disabled persons

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd