HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News From The Government For Those In Ap Backlog Posts Are Being Filled

Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Government
Andhra Pradesh Government

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా్తంగా వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గతేడాది మార్చి 31తో ఈ గడువు ముగియగా.. తాజాగా దాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. అంటే పోస్టుల భర్తీకి కాలపరిమితి మరో ఏడాది పెంచారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక డ్రైవ్‌ చేపట్టాలని అన్ని శాఖల్ని ఆదేశించింది. ఈ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు. రిజర్వేషన్‌ నిబంధనలు, నియామక మార్గదర్శకాలకు కట్టుబడి భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టింది. ముగ్గురు మాజీ మున్సిపల్ కమిషనర్లు, 43 మంది ఇతర అధికారులపై అభియోగాలు నమోదు చేస్తూ 63 ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2019-24 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఉచిత అన్నదాన కేంద్రానికి స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించగా, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ కేసులో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్లుగా పనిచేసిన చంద్రమౌళీశ్వరరెడ్డి, రాధా, వెంకటరమణయ్య, పట్టణ ప్రణాళిక విభాగం సహాయక కమిషనర్ మునిరత్నం, ఇద్దరు విశ్రాంత అధికారులు, ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఎకౌంట్స్ సెక్షన్ సిబ్బంది, 24 మంది సచివాలయ వార్డు కార్యదర్శులు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి సిఫారసులు పంపిన విచారణ బృందం, ఈ అక్రమాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాలతో పురపాలక శాఖలో అలజడి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • Backlog posts
  • disabled persons

Related News

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

CM Nara Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • భారత్‌పై న్యూజిలాండ్ ఘనవిజయం.. 50 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి

  • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

  • 1988లో ఆపరేషన్ కాక్టస్.. మాల్దీవుల అధ్య‌క్షుడిని కాపాడిన భారత సైన్యం!

  • న్యూజిలాండ్ భారీ స్కోర్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

  • పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

Trending News

    • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

    • టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

    • రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ ప‌వార్.. వైరల్ అవుతున్న పాత‌ ట్వీట్

    • విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!

    • అజిత్ ప‌వార్ సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd