HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Farmers Loan Waiver Of Rs 1 50 Lakhs Chandrababu

Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-04-2026 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Farmers
Amaravati Farmers

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు రెండో విడత భూసమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు. రైతులతో అర్ధరాత్రి వరకు సమావేశం కొనసాగగా, అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. వార్షిక కౌలు పెంచేందుకు అంగీకరించారు.

రాజధాని రెండో విడత భూసమీకరణలో రైతులకు ఏడాదికి వార్షిక కౌలు ఎకరానికి రూ.30 వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు రూ.40 వేలకు పెంచారు. పదేళ్ల పాటూ చెల్లిస్తామని తెలిపారు. అంతేకాదు, వార్షిక కౌలు ప్రతి ఏటా రూ.3వేల చొప్పున పెంచుతామన్నారు. అంతేకాదు, ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు అంగీకరించారు. రెండో విడత భూ సమీకరణకు సహకరించాలని చంద్రబాబు రైతుల్ని కోరారు. కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని, అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు.

అమరావతి భూముల్లో ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తాను తీసుకున్నానని, రైతులే బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలన్నారు చంద్రబాబు. రైతులంతా భూ సమీకరణను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌ కూడా ప్రపంచస్థాయి నగరంలా మారిందని, గతంలో రూ.లక్షల్లో ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లకు పెరిగిందన్నారు. అమరావతి కూడా అంతకుమించి అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చట్టబద్ధత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతకముందు రాజధాని ప్రాంతానికి చెందిన 70 మంది రైతులు చంద్రబాబుతో సమావేశంలో పాల్గొన్నారు. కౌలు పెంపు, రుణమాఫీ వంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుంచారు. అనంతరం సీఎం మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఆ తర్వాత వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై ప్రకటన చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన రైతుల్లో కర్లపూడి వారు మాత్రం తమకు అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఇవ్వాలని కోరారు. మరో నాలుగు గ్రామాల ప్రజలు తమకు ఒకేచోట స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి హామీ ఇవ్వలేదు. మొత్తం మీద అమరావతి రైతులకు ఊరట దక్కింది. వార్షిక కౌలు పెంచడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. తాము కోరిన విధంగా కౌలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi farmers
  • Amaravati capital
  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • koulu rythulu
  • Raithu Runamafi

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

  • Chandrababu Naidu is serious about Sai Krishna's missing case.

    Vijayawada: సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబు సీరియస్

  • Good news from the government for those waiting for pensions.

    Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

    Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd