HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Farmers Loan Waiver Of Rs 1 50 Lakhs Chandrababu

Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-04-2026 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Farmers
Amaravati Farmers

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు రెండో విడత భూసమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు. రైతులతో అర్ధరాత్రి వరకు సమావేశం కొనసాగగా, అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. వార్షిక కౌలు పెంచేందుకు అంగీకరించారు.

రాజధాని రెండో విడత భూసమీకరణలో రైతులకు ఏడాదికి వార్షిక కౌలు ఎకరానికి రూ.30 వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు రూ.40 వేలకు పెంచారు. పదేళ్ల పాటూ చెల్లిస్తామని తెలిపారు. అంతేకాదు, వార్షిక కౌలు ప్రతి ఏటా రూ.3వేల చొప్పున పెంచుతామన్నారు. అంతేకాదు, ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు అంగీకరించారు. రెండో విడత భూ సమీకరణకు సహకరించాలని చంద్రబాబు రైతుల్ని కోరారు. కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని, అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు.

అమరావతి భూముల్లో ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తాను తీసుకున్నానని, రైతులే బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలన్నారు చంద్రబాబు. రైతులంతా భూ సమీకరణను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌ కూడా ప్రపంచస్థాయి నగరంలా మారిందని, గతంలో రూ.లక్షల్లో ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లకు పెరిగిందన్నారు. అమరావతి కూడా అంతకుమించి అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చట్టబద్ధత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతకముందు రాజధాని ప్రాంతానికి చెందిన 70 మంది రైతులు చంద్రబాబుతో సమావేశంలో పాల్గొన్నారు. కౌలు పెంపు, రుణమాఫీ వంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుంచారు. అనంతరం సీఎం మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఆ తర్వాత వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై ప్రకటన చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన రైతుల్లో కర్లపూడి వారు మాత్రం తమకు అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఇవ్వాలని కోరారు. మరో నాలుగు గ్రామాల ప్రజలు తమకు ఒకేచోట స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి హామీ ఇవ్వలేదు. మొత్తం మీద అమరావతి రైతులకు ఊరట దక్కింది. వార్షిక కౌలు పెంచడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. తాము కోరిన విధంగా కౌలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi farmers
  • Amaravati capital
  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • koulu rythulu
  • Raithu Runamafi

Related News

Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్‌ను రూ.82.49 కోట్లతో ఒ

  • Police Raids At Pastor Ganta John Baburao House

    వామ్మో చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

  • BJP's Tejasvi Surya Slams congress party

    BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Prakash Raj: ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

  • కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

  • Nirahara Deeksha: అంబటి నిరాహార దీక్ష..

Trending News

    • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd