HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Andhra Pradesh 34 New Amrit Bharat Stations Granted To State

Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు

Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.

  • Author : Pasha Date : 25-02-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amrit Bharat Stations
Amrit Bharat Stations

Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 34 అమృత్ భారత్ రైల్వే స్టేషన్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించింది. అమృత్ భారత్ స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫిబ్రవరి 26న ( సోమవారం) వీటికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.843.54 కోట్లతో ఈ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరణ చేయనున్నారు. ఇక  సోమవారం రోజు దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ స్టేషన్లకు(Amrit Bharat Stations) వర్చువల్ విధానం ద్వారా ప్రధాని మోడీ  శంకుస్థాపన చేస్తారు. 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులకు భూమిపూజ కూడా చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్‌లో భాగంగా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతారు. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 72 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడతో పాటుగా, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను కేంద్రం గుర్తించింది. వీటి అభివృద్ధికి రూ.270 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లలో పనులు జరుగుతున్నాయి. తాజాగా మరో 34 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఆ లిస్టు వివరాలు కింద ఉన్నాయి.

Also Read : Landlord Vs Tenant : 11 నెలల అద్దె అగ్రిమెంటులో ఆ ట్విస్ట్.. మీకు తెలుసా ?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, అనపర్తి, ఆదోనీ, బాపట్ల, చీరాల, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. అలాగే మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికుడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకొట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.610.30 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.

Also Read :MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ, కీలక అంశాలు ప్రస్తావన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amrit Bharat Stations
  • andhra pradesh
  • CM YS Jagan
  • good news

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd