HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Chief Minister Ys Jagan Strongly Criticizes Privatization Of Government Medical Colleges

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • Author : Gopichand Date : 05-09-2025 - 8:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిర్ణయం ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కమీషన్ల కోసం అప్పగించడమేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవినీతికి పరాకాష్ట అని, రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం మాత్రమే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

2019కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని జగన్ ఎత్తి చూపారు. తమ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎన్నికల తర్వాత మరో కళాశాలలో అడ్మిషన్లు జరిగాయని చెప్పారు. మిగిలిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఉంటే ఈ ఏడాది మరో 7 కళాశాలలు ప్రారంభమై ఉండేవి కదా అని ప్రశ్నించారు. ఈ కళాశాలలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి భూముల విలువ పెరగడం వల్లే వాటిని కొట్టేయడానికి ఈ ప్రైవేటీకరణ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు.

Also Read: Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి! 

1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP

— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025

ఆరోగ్యశ్రీపై నిధుల ఎగవేత ఆరోపణలు

వైద్య విద్యలో సీట్ల పెంపుపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్లు 2,360 నుంచి 4,910కి పెరిగాయని, దాదాపు 800 కొత్త సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. వైద్య విద్యలో ఇది అద్భుతమైన కార్యక్రమం అని అభివర్ణించారు. పేద విద్యార్థులకు ఉచితంగా, తక్కువ ఫీజుతో వైద్య విద్య లభించే అవకాశాన్ని ఈ ప్రైవేటీకరణ దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల కళాశాలకు ఎన్ఎంసి వైద్య సీట్లు ఇస్తే చంద్రబాబు వద్దని లేఖ రాసినప్పుడే ఆయన కుట్ర బయటపడిందని జగన్ అన్నారు.

ఆరోగ్యశ్రీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జగన్ ఆరోపించారు. 15 నెలల కాలంలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 4,500 కోట్లలో కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ. 4,000 కోట్లు ఎగ్గొట్టి పేదవారి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారని విమర్శించారు. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని, విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేలు ఇచ్చే ఆరోగ్య ఆసరాను కూడా నాశనం చేశారని అన్నారు.

ప్రైవేటీకరణపై సందేహాలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు. కోవిడ్ వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వమే ఉచిత చికిత్సలు అందించిందని, ఇప్పుడు ఆ అవకాశం ఉండదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలను రద్దు చేసి, కళాశాలలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పాపాలకు ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • CM Chandrababu
  • medical colleges
  • Privatization
  • ys jagan

Related News

Amaravati Inner Ring Road Case

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

Latest News

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd