HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Chief Minister Ys Jagan Strongly Criticizes Privatization Of Government Medical Colleges

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • By Gopichand Published Date - 08:29 PM, Fri - 5 September 25
  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిర్ణయం ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కమీషన్ల కోసం అప్పగించడమేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవినీతికి పరాకాష్ట అని, రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం మాత్రమే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

2019కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని జగన్ ఎత్తి చూపారు. తమ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎన్నికల తర్వాత మరో కళాశాలలో అడ్మిషన్లు జరిగాయని చెప్పారు. మిగిలిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఉంటే ఈ ఏడాది మరో 7 కళాశాలలు ప్రారంభమై ఉండేవి కదా అని ప్రశ్నించారు. ఈ కళాశాలలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి భూముల విలువ పెరగడం వల్లే వాటిని కొట్టేయడానికి ఈ ప్రైవేటీకరణ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు.

Also Read: Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి! 

1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP

— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025

ఆరోగ్యశ్రీపై నిధుల ఎగవేత ఆరోపణలు

వైద్య విద్యలో సీట్ల పెంపుపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్లు 2,360 నుంచి 4,910కి పెరిగాయని, దాదాపు 800 కొత్త సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. వైద్య విద్యలో ఇది అద్భుతమైన కార్యక్రమం అని అభివర్ణించారు. పేద విద్యార్థులకు ఉచితంగా, తక్కువ ఫీజుతో వైద్య విద్య లభించే అవకాశాన్ని ఈ ప్రైవేటీకరణ దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల కళాశాలకు ఎన్ఎంసి వైద్య సీట్లు ఇస్తే చంద్రబాబు వద్దని లేఖ రాసినప్పుడే ఆయన కుట్ర బయటపడిందని జగన్ అన్నారు.

ఆరోగ్యశ్రీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జగన్ ఆరోపించారు. 15 నెలల కాలంలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 4,500 కోట్లలో కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ. 4,000 కోట్లు ఎగ్గొట్టి పేదవారి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారని విమర్శించారు. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని, విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేలు ఇచ్చే ఆరోగ్య ఆసరాను కూడా నాశనం చేశారని అన్నారు.

ప్రైవేటీకరణపై సందేహాలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు. కోవిడ్ వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వమే ఉచిత చికిత్సలు అందించిందని, ఇప్పుడు ఆ అవకాశం ఉండదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలను రద్దు చేసి, కళాశాలలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పాపాలకు ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • CM Chandrababu
  • medical colleges
  • Privatization
  • ys jagan

Related News

CM Chandrababu

Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • CM Chandrababu Naidu

    Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన

  • Made In India Products Chan

    Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd