HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Releases Funds For Rythu Bharosa Scheme

YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ మూడో విడత ఆర్థిక సహాయం

  • By Praveen Aluthuru Published Date - 03:56 PM, Wed - 28 February 24
  • daily-hunt
YSR Rythu Bharosa
YSR Rythu Bharosa

YSR Rythu Bharosa: రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ మూడో విడత ఆర్థిక సహాయం కింద రూ 1,078.36 కోట్లు, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.215.98 కోట్లు సీఎం జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సాయాన్ని జమ చేసిన సీఎం జగన్, వరుసగా ఐదవ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సహాయం అందించింది.

సీఎం జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావాలనే తపనతో చంద్రబాబు నాయుడు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణమాఫీని ప్రకటించారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రుణమాఫీ చేయకుండా రైతులకు వ్యవసాయ రుణ పత్రాలు ఇస్తూ రైతులను మోసం చేసినట్లు ఆరోపించారు. తదనంతరం జీరో-వడ్డీ సబ్సిడీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతులు ఏటా రూ.5,000 – 6,000 కోట్ల వడ్డీ, చక్రవడ్డీలు చెల్లించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందగా, 10.78 లక్షల మంది రైతులు సున్న వడ్డి, పంట రుణాల ప్రయోజనాలను పొందారని గుర్తు చేశారు సీఎం జగన్.

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రూ 13,500 సాయం అందజేస్తోంది. మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఏడాది రైతులకు రూ.11,500 చొప్పున రెండు విడతల ఆర్థిక సాయం అందించింది. ఈ పథకం కింద మూడో విడతగా రూ.2000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సాయం జమ అవుతుంది.

రాష్ట్ర రైతుల శ్రేయస్సుపైనే రాష్ట్ర సంక్షేమం ఆధారపడి ఉందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని అన్నారు సీఎం జగన్. గత 57 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం రైతులు, రైతుకూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన దానికంటే ఎక్కువే అందించిందని, తమ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరిచారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని, అయితే రూ.67,500 అంటే రూ.17,500 అదనంగా ఇచ్చామని చెప్పారు. వైఎస్ఆర్ సున్న వడ్డి పంట రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం నేడు రూ.215.98 కోట్లు విడుదల చేసి 10.78 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Also Read: Bill Gates : నిరుపేదల బస్తీలో అపర కుబేరుడు బిల్‌గేట్స్.. పర్యటన విశేషాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1078.36 crore
  • 215.98 crore
  • chandrababu
  • cm jagan
  • credit interest
  • farmers
  • pm kisan
  • rythu bharosa
  • tdp
  • ysr
  • ysrcp

Related News

Balakrishna Cbn

Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

Balakrishna Comments : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా కామినేని, బాలకృష్ణ (Kameneni Vs Balakrishna)మధ్య చోటుచేసుకున్న మాటల తూటాలు సత్తా చాటగా, ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం

  • Tdp Leaders Ycp

    Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • Cbn Sharmila

    Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Latest News

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

  • ‎Banana: అరటిపండు ఎప్పుడు తింటే మంచిది ఉదయమా లేక రాత్రినా!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd