HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Ramp Walks At Party Meetings

CM Jagan: ర్యాంప్‌ వాక్ పై సీఎం జగన్.. క్యాడర్ అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా కలిసిన సభ ఇదే.

  • Author : Praveen Aluthuru Date : 07-02-2024 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Jagan
Cm Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా కలిసిన సభ ఇదే. సీఎం జగన్ తన పదవీ కాలంలో ఇప్పటి వరకు పత్రికా ముఖంగా ఎప్పుడు చేరువైంది లేదు.

టీడీపీ-జన సేన కూటమికి వ్యతిరేకంగా తన క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు .ఇప్పటి వరకు సీఎం జగన్ నేతృత్వంలో రెండు బహిరంగ సమావేశాలు జరిగాయి. ఒకటి విశాఖపట్నం. మరొకటి ఏలూరులో. మరో మూడు సమావేశాలు జరగాల్సి ఉంది. జగన్ బహిరంగ సభలలో బాగా చర్చకు దారి తీసింది రాంప్ వాక్ స్టేజ్. వేదిక నుండి ప్రజలు కూర్చునే చోటికి రాంప్ ని ఏర్పాటు చేశారు.

జనవరి 3న జరిగిన ఏలూరు సభలో జగన్ 40 నిమిషాల పాటు ర్యాంప్‌పై నడిచారు . చాలా ఏళ్ల తర్వాత ఆయన్ని అంత దగ్గరి నుంచి చూశాం. మాకే కాదు, చాలా మంది కార్యకర్తలు కూడా ఆయన్ను దగ్గరి నుంచి చూశామని కార్యకర్తలు చెప్తున్నారు. ఈ సమావేశానికి ఇతర బహిరంగ సభలకు భిన్నంగా ఏమీ లేదని విశాఖపట్నం పార్టీ కార్యకర్త అభిప్రాయపడ్డారు: మాలో చాలా మంది, మండల స్థాయి నాయకులతో సహా స్థానిక స్థాయిలోని సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. కానీ మా సమస్యలు వినేవాళ్ళు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ జగన్ మా ప్రశ్నలకు సమాధానం ఇస్తారని మాకు చెప్పారు కానీ అలా ఏమీ జరగలేదు. జిల్లాలోని క్యాడర్ అంతా హాజరైనా కొత్తదనం కనిపించలేదు. ఆయన కొన్నేళ్లుగా చేస్తున్న ప్రభుత్వ సమావేశాలలా అనిపించిందని వాపోయారు. అంటే ప్రభుత్వం నిర్వహించే సభలా ఉన్నదే తప్ప పార్టీ మీటింగ్ అనిపించలేదని ఇతర కార్యకర్తలు తమ బాధని వ్యక్త పరిచారు. గత నాలుగున్నరేళ్లలో మా సమస్యలను పార్టీ అగ్రనేతలు ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే ప్రాంతీయ ఇంచార్జి సమావేశంలో మేము మా సమస్యలను ప్రస్తావించాము, కానీ ఏదీ పరిష్కారం కాలేదని చెప్పారు.

ప్రజలతో కనెక్టివిటీ లేకపోవడం వల్ల తెలంగాణలో మూడోసారి అధికారం కోసం బీఆర్‌ఎస్ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్సీపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. అధికార వ్యతిరేకత ఉన్నప్పటికీ పాత అభ్యర్థులను ప్రకటించడం మరియు ప్రజలని కలవకపోవడం కారు పార్టీ నష్టానికి కారణమని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ ఇప్పటి వరకు 16 మంది పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌లు, 64 మంది అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు మొత్తం ఆరు ఇన్‌ఛార్జ్‌ల జాబితాలను ప్రకటించారు. 16 మంది ఎంపీలలో ఇద్దరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ మరియు 64 మంది ఇన్‌చార్జ్‌ల జాబితాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. అధికార వ్యతిరేకతను నివారించేందుకు ఇన్‌ఛార్జ్‌లను మార్చినట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల కోసం క్యాడర్‌లో స్ఫూర్తిని రగిలించేలా ఆంధ్రప్రదేశ్ అంతటా సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ వ్యవహారాల్లో క్యాడర్ చురుగ్గా పాల్గొనడం లేదన్న అంతర్గత నివేదికల నేపథ్యంలోనే క్యాడర్‌లో స్ఫూర్తిని రగిలిస్తోంది. పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు వాలంటీర్లను ప్రవేశపెట్టడం వల్ల క్యాడర్ చాలావరకు పక్కకు తప్పుకున్నట్లు అనిపిస్తుంది. ఇది అట్టడుగు స్థాయి నాయకులను అసంతృప్తికి గురిచేసింది. ఇంటింటికీ సేవలు అందించడానికి ప్రభుత్వం 2019లో వాలంటీర్లను ప్రవేశపెట్టింది. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పోయింది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ అవుతున్నాయి. దీంతో గ్రామ స్థాయి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

చాలా మంది సర్పంచ్‌లు రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం 14వ మరియు 15వ ఆర్థిక సంఘం (వరుసగా 965 కోట్లు మరియు 344 కోట్లు) నిధులను పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా నిర్వహించారు. అనేక స్థానిక పనులు పెండింగ్‌లో ఉండటంతో, పెండింగ్ పనులపై ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొన్నామని, 2021 లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటి నుండి బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు.

Also Read: OnePlus: వాలెంటైన్స్ డే ఆఫర్.. వన్ ప్లస్ ఫోన్ ను ఆఫర్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • cadre
  • cm jagan
  • elections
  • Jana Sena
  • Ramp walks
  • Siddham
  • tdp
  • vishakapatnam

Related News

Ap Legislative Council

మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • Tadapatla Ratnabai Dies

    Tadapatla Ratnabai : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి ఇకలేరు

Latest News

  • AI Impact Summit : ఇండియా AI సమిట్‌లో చొక్కాలు విప్పి నిరసన

  • 17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

  • బ్రతికుండగానే సమాధి కట్టుకున్న వృద్ధుడి ప్రేమగాథ

  • డంపింగ్ యార్డులో మదనపల్లె కులవర్ధన్ అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు రాని కుటుంబ సభ్యులు

  • Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd