HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababus Uae Visit Is Like A Victory March

CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

  • Author : Gopichand Date : 25-10-2025 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) యూఏఈ  పర్యటన, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన అద్భుతమైన ‘జైత్రయాత్ర’లా సాగింది. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతోంది.

ఒకవైపు ముఖ్యమంత్రి యూఏఈలో పెట్టుబడి వేట కొనసాగిస్తుంటే.. మరోవైపు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో రాష్ట్రానికి పెట్టుబడుల జాతర తీసుకువచ్చేందుకు కృషి చేశారు. వీరి సమష్టి కృషి ఫలితంగానే నేడు విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్లతో ఏఐ (AI) సిటీ ఏర్పాటుకు గూగుల్ వంటి దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. వైఎస్సార్సీపీ చేయలేని అభివృద్ధి, తీసుకురాలేనన్ని పెట్టుబడులు, పరిశ్రమలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ పర్యటనలు స్పష్టం చేశాయి.

ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ను భారత్‌లోనే కాదు.. ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటన సాగింది. దుబాయ్, అబుదాబి వంటి దేశాలలో పర్యటించి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై అనేక అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చించారు.

దిగ్గజ సంస్థలతో చర్చలు

సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చల్లో లాజిస్టిక్స్, ఆరోగ్య రంగం, షిప్‌బిల్డింగ్, మైనింగ్ వంటి కీలక రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది.

పెట్టుబడులకు అనువైన వాతావరణంపై ప్రజెంటేషన్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, మెరుగైన పోర్టులు, రహదారులు, ఎయిర్ కనెక్టివిటీతో పాటు సబ్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్న రాష్ట్రం కావడం వలన పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన గమ్యంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాలు సాంకేతికత, ఇన్నోవేషన్, పరిశ్రమల కేంద్రాలుగా ఎదుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం అందిస్తున్న స్థిరమైన పాలన, పారదర్శక విధానాలపై ప్రపంచ పెట్టుబడిదారులు విశ్వాసం ఉంచుతున్నారని సీఎం పేర్కొన్నారు.

CII భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే CII భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని యూఏఈలోని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

స్వర్ణాంధ్రంగా ఏపీ

‘మాటలతో కాదు చేతల్లో చూపించడం అంటే ఇదే’ అని కూటమి ప్రభుత్వం నిరూపించింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలతో రాష్ట్రం మళ్లీ ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే అజెండాగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గర్వంగా “స్వర్ణాంధ్రం”గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • Minister Nara lokesh
  • telugu news
  • UAE Tour

Related News

T-SAT

నూతన విద్యా విధానంలో టి-సాట్ భాగస్వామ్యం.. మంత్రిని కోరిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి

మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. ఐటి శాఖ పరిధిలో ఉన్న టి-సాట్ సేవలను విద్యా విధాన రూపకల్పనలో ఏ విధంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

  • CM Chandrababu

    దేశంలో రెండో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్ర‌బాబు!

  • CM Revanth Reddy

    సీఎం రేవంత్ పాల‌నలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్‌ దిశగా తెలంగాణ‌!

  • CM Revanth Reddy

    ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

  • Narasapuram Lace

    నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!

Latest News

  • మావోయిస్టులకు భారీ దెబ్బ: బీజాపూర్ అడవుల్లో 12 మంది మావోలు మృతి

  • ఈ ఏడాది పండుగల తేదీలు..

  • బాలయ్య అఖండ 2 ఓటిటి డేట్ ఫిక్స్..

  • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా ?

  • తెలంగాణ లో నేటినుండి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)

Trending News

    • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd