HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Reviews The Crisis In Aqua Sector

AP Govt : ఆక్వా సంక్షోభంపై క‌మిటీ ఏర్పాటు.. త్వ‌ర‌లో ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

  • By News Desk Published Date - 11:37 PM, Mon - 7 April 25
  • daily-hunt
Cm Chandrababu Naidu
Cm Chandrababu Naidu

AP Govt : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్, చైనా స‌హా ప‌లు దేశాల‌పై ప్ర‌తీకార సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. భార‌త్ పై 26శాతం ప్ర‌తీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణ‌యంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. అంటే సగటున రోజుకు 1,960 టన్నులు వ‌స్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 70శాతం. ట్రంప్ దెబ్బతో ఈ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆక్వా రంగంపై సుంకాలు త‌గ్గించేలా యూఎస్ ప్ర‌భుత్వంలో చ‌ర్చించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. తాజాగా.. ఆక్వారంగం స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించారు.

Also Read: Donald Trump: టారిఫ్ వార్‌.. చైనాకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్‌.. చైనా వెన‌క్కు త‌గ్గుతుందా..?

అక్వారంగం స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షలో ఆక్వా రైతులు, ఎంపీలు లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు, బాల‌శౌరి, అధికారులు పాల్గొన్నారు. భార‌త్ ఉత్ప‌త్తుల‌పై అమెరికా సుంకాల విధింపుతో న‌ష్టాల్లో ఆక్వారంగం కూరుకుపోయింద‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. యూఎస్ సుంకాల వ‌ల్ల‌ ఏర్ప‌డిన ఆక్వా సంక్షోభంపై క‌మిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులు, ఎగుమ‌తిదారులు, ట్రేడ‌ర్లు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ.. ఆక్వా స‌మ‌స్య‌ల‌పై కేంద్ర వాణిజ్య మంత్రిని త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌లుస్తార‌ని చెప్పారు.

Also Read: YS Sharmila: ఈ జన్మకు మారరు.. ప‌చ్చ‌కామెర్ల రోగం ఇంకా త‌గ్గ‌లేదా..? జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్‌

భార‌త్ ఉత్ప‌త్తుల‌పై అమెరికా సుంకాల విధింపుతో ఆక్వా రంగం న‌ష్టాల్లో కూరుకుపోయింది. రోయ్య‌ల చెరువుల‌కు తాజా నీరు ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు అంగీకారని ఆనం అన్నారు. క‌మిటీ నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంది. ఆక్వా ఉత్ప‌త్తుల విలువ జోడింపుపై దృష్టి పెట్టాల‌ని సీఎం సూచించారు. ఆక్వా ఎగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయాలు చూడాల‌ని సూచించారు. చైనా, థాయిలాండ్ కు ఎగుమ‌తి చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఆదేశించార‌ని ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి తెలిపారు. 100 కౌంట్ రొయ్య‌ల‌ను రూ.220 కు కొనేందుకు ఎగుమ‌తిదారులు అంగీక‌రించారు. ప్ర‌స్తుతం ఆక్వా రైతులు ఎక్క‌డా క్రాఫ్ హాలిడే నిర్ణ‌యం తీసుకోలేదు. ఆక్వా రైతులు ఆందోళ‌న‌కు గురికావాల్సిన అవ‌స‌రం లేదని వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్నారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aqua sector
  • chandrababu naidu
  • Crisis
  • Trump Tariff

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Cm Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్

  • CM Chandrababu

    CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd