HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Reviews The Crisis In Aqua Sector

AP Govt : ఆక్వా సంక్షోభంపై క‌మిటీ ఏర్పాటు.. త్వ‌ర‌లో ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

  • Author : News Desk Date : 07-04-2025 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Naidu
Cm Chandrababu Naidu

AP Govt : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్, చైనా స‌హా ప‌లు దేశాల‌పై ప్ర‌తీకార సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. భార‌త్ పై 26శాతం ప్ర‌తీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణ‌యంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. అంటే సగటున రోజుకు 1,960 టన్నులు వ‌స్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 70శాతం. ట్రంప్ దెబ్బతో ఈ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆక్వా రంగంపై సుంకాలు త‌గ్గించేలా యూఎస్ ప్ర‌భుత్వంలో చ‌ర్చించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. తాజాగా.. ఆక్వారంగం స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించారు.

Also Read: Donald Trump: టారిఫ్ వార్‌.. చైనాకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్‌.. చైనా వెన‌క్కు త‌గ్గుతుందా..?

అక్వారంగం స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షలో ఆక్వా రైతులు, ఎంపీలు లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు, బాల‌శౌరి, అధికారులు పాల్గొన్నారు. భార‌త్ ఉత్ప‌త్తుల‌పై అమెరికా సుంకాల విధింపుతో న‌ష్టాల్లో ఆక్వారంగం కూరుకుపోయింద‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. యూఎస్ సుంకాల వ‌ల్ల‌ ఏర్ప‌డిన ఆక్వా సంక్షోభంపై క‌మిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులు, ఎగుమ‌తిదారులు, ట్రేడ‌ర్లు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ.. ఆక్వా స‌మ‌స్య‌ల‌పై కేంద్ర వాణిజ్య మంత్రిని త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌లుస్తార‌ని చెప్పారు.

Also Read: YS Sharmila: ఈ జన్మకు మారరు.. ప‌చ్చ‌కామెర్ల రోగం ఇంకా త‌గ్గ‌లేదా..? జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్‌

భార‌త్ ఉత్ప‌త్తుల‌పై అమెరికా సుంకాల విధింపుతో ఆక్వా రంగం న‌ష్టాల్లో కూరుకుపోయింది. రోయ్య‌ల చెరువుల‌కు తాజా నీరు ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు అంగీకారని ఆనం అన్నారు. క‌మిటీ నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంది. ఆక్వా ఉత్ప‌త్తుల విలువ జోడింపుపై దృష్టి పెట్టాల‌ని సీఎం సూచించారు. ఆక్వా ఎగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయాలు చూడాల‌ని సూచించారు. చైనా, థాయిలాండ్ కు ఎగుమ‌తి చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఆదేశించార‌ని ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి తెలిపారు. 100 కౌంట్ రొయ్య‌ల‌ను రూ.220 కు కొనేందుకు ఎగుమ‌తిదారులు అంగీక‌రించారు. ప్ర‌స్తుతం ఆక్వా రైతులు ఎక్క‌డా క్రాఫ్ హాలిడే నిర్ణ‌యం తీసుకోలేదు. ఆక్వా రైతులు ఆందోళ‌న‌కు గురికావాల్సిన అవ‌స‌రం లేదని వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aqua sector
  • chandrababu naidu
  • Crisis
  • Trump Tariff

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

    Latest News

    • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

    • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

    • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

    • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    Trending News

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd