HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu And Minister Lokesh Voted In The Mlc Elections

MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు

‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 27-02-2025 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu and Minister Lokesh voted in the MLC elections
CM Chandrababu and Minister Lokesh voted in the MLC elections

MLC Elections : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేశ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్‌ చేరుకుని ఓటు వేశారు.

Read Also: MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు , లోకేష్ . @ncbn @naralokesh #ChandrababuNaidu #NaraLokesh #TDP #MLC #MLCElection2025 #mlcpolls #HashtagU pic.twitter.com/tTVJWqkjMW

— Hashtag U (@HashtaguIn) February 27, 2025

 

ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (కూటమి) కేఎస్‌ లక్ష్మణరావు (పీడీఎఫ్‌) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కుఅన్ని ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా పోలింగ్‌ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో 6 లక్షల 62 వేల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 939 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధమయ్యాయి. పోలింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌పై జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చు.

Read Also: SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • democratic country
  • guntur
  • Joint Krishna
  • mlc elections

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Ppolice ride Gold Silver And Cash Seized

    పేరు కే కూలి ఇంట్లో బయటపడ్డ భారీ సంపద..!

Latest News

  • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

  • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

  • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

Trending News

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd