HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Wrote A Letter To Rtc Md Tirumala Rao

Chandrababu: ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే ?

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు బస్సులతో కిటకిట లాడుతున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 11-05-2024 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

Chandrababu: ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది. మరికొద్దీ గంటల్లో అక్కడ అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన ఏకమవ్వగా, అధికార వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగనుంది. దీంతో ఆంధ్రాలో ఎన్నికల ఫీవర్ ఊపందుకుంది. అయితే ఓటర్ల శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అనేక ఏర్పాట్లను చేసింది. తాజాగా చంద్రబాబు ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు బస్సులతో కిటకిట లాడుతున్నాయి. అయితే భారీగా ప్రజలు తమ ఓట్లను వినియోగించుకునేందుకు ఊర్లకు బయలు దేరుతుండటంతో బస్సుల కొరత కనిపిస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు లేఖ రాశారు.

పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం వల్ల ఓటర్ల సంఖ్య పెరుగుతుందని చంద్రబాబు సూచించారు. ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి ఏపీ ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, ఈ సమయంలో ఆర్టీసీ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్, విజయవాడ, బస్టాండ్‌లు రద్దీగా ఉన్నాయని, అవసరమైనన్ని బస్సులను అందుబాటులో ఉంచాలని చంద్రబాబు కోరారు.

Also Read: Kadapa : BJP అంటే బాబు, జగన్, పవన్ – రాహుల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • chandrababu
  • cm jagan
  • Janasena
  • letter
  • reservation
  • rtc md
  • tdp
  • Tirumala Rao
  • voters
  • ysrcp

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd