HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Key Orders To Officials

Floods in AP : వరదల్లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపు అంత్యక్రియలు – చంద్రబాబు

అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

  • Author : Sudheer Date : 04-09-2024 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Review Meting
Babu Review Meting

భారీ వర్షాలు (Heavy Rains) ఏపీని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుడమేరు వరదకు విజయవాడ (Vijayawada) నగరం నీటమునిగింది. ప్రస్తుతం వరద తగ్గడం తో ప్రభుత్వం సహాయక చర్యలు స్పీడ్ చేసింది. అలాగే ఇల్లు వదిలి వెళ్లిన బాధితులంతా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక రెండు రోజులుగా సీఎం చంద్రబాబు రేయిపగలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ..బాధితుల కష్టాలు అడిగితెలుసుకున్నారు. అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు (Dead Bodies) వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాల‌ని,.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు సీఎం (CHandrababu) ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

వరదల తీవ్రతపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ, పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించేందుకు పని చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకురావాల‌న్నారు… ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాల‌ని,.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయాలని సూచించారు.

వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి ఆహారం అందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రతికుటుంబానికి నిత్యవసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల ఆలుగడ్డలు, కేజీ చక్కెర ఇవ్వాలన్నారు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్‌లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాల‌ని, . శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాల‌న్నారు. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాల‌ని సూచించారు. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంద‌ని, . ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాల‌ని సూచించారు.. ప్ర‌తి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాల‌ని అంటూ.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించడంతో పాటు పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also : Pawan Kalyan Donation : తెలంగాణకు కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • dead bodies
  • floods
  • heavy rains

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd