NTR Fan: శ్యామ్ మృతిపై చంద్రబాబు ఆరా, కుటుంబానికి 2 లక్షల సాయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు శ్యామ్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నన్నారు.
- By Hashtag U Published Date - 01:08 PM, Thu - 29 June 23
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ (Shyam) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. శ్యామ్ కు తారక్ అంటే అంత పిచ్చి మరి. ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ లో ఒక వీరాభిమాని. చిన్న వయసులోనే మరణించడంతో తారక్ అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు శ్యామ్ కుటుంబానికి అండగా నిలువగా, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు అండగా నిలిచారు. శ్యామ్ మణికంఠ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, శ్యామ్ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు గారు. శ్యామ్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం ప్రకటించటమే కాక, న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన. అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. శ్యామ్ ఎలా చనిపోయాడో తెలియడం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాను. ఆయన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
తూర్పుగోదావరి జిల్లాలో శ్యామ్ మణికంఠ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెబుతుంటే… కాదు హత్య చేయబడ్డాడు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శ్యామ్ ను హత్య చేసింది వైసీపీ నేతలే అని ప్రజలు అంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు వారు చెబుతున్న బలమైన ఆధారాలు ఏంటో వీడియోలో చూడండి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది టీడీపీ పార్టీ.
Also Read: Ambati Rayudu: జనం నాడి తెలుసుకున్నా, రాజకీయాల్లోకి వస్తున్నా: అంబటి రాయుడు
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.