HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Capital Of Amravati Is For Chandrababus Own Benefit

Botsa Satyanarayana: చంద్ర‌బాబు సొంత లాభం కోసమే అమ‌రావ‌తి..!

  • Author : HashtagU Desk Date : 08-03-2022 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Satyanarayana Chandrababu
Botsa Satyanarayana Chandrababu

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజ‌ధాని విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స స‌త్య‌నారాయ‌ణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్ర‌భుత్వ‌ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్ప‌ష్టం చేశారు. ఇక‌ ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామ‌ని బొత్స పేర్కొన్నారు.

మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని బొత్స‌ అన్నారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కావని వెల్లడించారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తి పరిపాలన చేశారని పరోక్షంగా టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారని బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తు చేశారు.

ఇక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌ల పై స్పందిస్తూ.. మనిషి పెరిగాడు కాని బుర్ర పెరగలేదని అచ్చెన్న పై బొత్స మండిపాడ్డారు. ఇక‌పోతే మరోవైపు మూడురాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటీవ‌ల ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి అమరావతే రాజధాని అని స్పష్టం చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని వెల్లడించింది. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ అంశాన్ని జ‌గ‌న్ ప్రభుత్వం కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే అమరావతి ఒక్కటే కాదు, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక వివిధ సందర్భాల్లో వివిధ నిర్ణయాలపై న్యాయ వ్యవస్థ నుంచి ప్రతిరోధకాలు ఎదురవుతూ వస్తున్నాయి. న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు నిలిచిపోయాయనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గతంలోనే చాలాసార్లు శాసనసభ, న్యాయవ్యవస్థ అధికారాలపై చర్చ జరగాలని బాహాటంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీంత‌తో ఇప్పుడు అమరావతి హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఈసారి చ‌ర్చ‌య‌ తప్పనిసరి అని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • andhra pradesh
  • botsa satyanarana
  • chandrababu naidu
  • tdp
  • ysrcp

Related News

TDP candidate Bodepudi Revathi wins in Madhira

మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

TDP candidate Bodepudi Revathi wins in Madhira  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిట

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd