HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Nominated Posts Cm Chandrababu Focuses On Filling Second Phase Of Nominated Posts

AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..

  • Author : Kode Mohan Sai Date : 26-10-2024 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Nominated Posts
Ap Nominated Posts

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించారు.

రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే అవకాశముందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం కష్టపడినవారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, చాలామంది టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం ఉంది. మిత్రపక్షాలతో కూడ చంద్రబాబు వివిధ చర్చలు కొనసాగిస్తున్నారు.

నామినేటెడ్ పదవుల్లో మిత్రపక్షాలకు 30 శాతం పదవులు కేటాయించాలనే అంగీకారం ఇప్పటికే కుదిరింది. ఈ మేరకు, రెండో దశలో పదవుల నియామకం జరుగబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. అలాగే, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను కూడా నియమించింది. ఇప్పటి వరకు ఏడు కార్పొరేషన్లలో 64 మందికి సభ్యత్వం కల్పించారు, మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతం ఛైర్మన్లను మాత్రమే ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన విధానాన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా వర్తింపజేశారు. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా నియమించారు. జనసేన నుంచి ముగ్గురు ఛైర్మన్లుగా, 9 మంది సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌ పోస్టు టీడీపీకి దక్కింది.

అశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొదటి విడతలో చాలా మంది నామినేటెడ్ పోస్టులను ఆశించారు, కానీ వారికి అవకాశాలు దక్కలేదు. అందువల్ల, రెండో విడతలో కనీసం తమకు అవకాశం రావాలని కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. విజయవాడ కేంద్రంగా లాబీయింగ్ ప్రారంభించారు. ఈ దఫా, కూటమి నేతల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే, కొత్తగా పార్టీలోకి చేరిన వారికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశముందని సమాచారం అందింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Nominated Posts
  • CM Chandrababu
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • TDP Nominated Posts
  • telugudesam party

Related News

Mudragada Letter

చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Rambabu Comments

    రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd