HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Prepares Plan A And Plan B For Selection Of New Ministers

AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?

  • Author : hashtagu Date : 07-04-2022 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
66
66

ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద్దిపాటి ప్రాధాన్యతను ఇవ్వడం. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లలో ఏది అమలు చేస్తారు అన్నదానిపై ఇంకా వైసీపీ వర్గాలకు క్లారిటీ లేదు. కాకపోతే ఇందులో ప్లాన్ A వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారని చెప్పలేం. ప్రస్తుత మంత్రుల్లో కొద్దిమందిని కొనసాగించే అవకాశం ఉంది. సీనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. వారిలో బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, బాలినేనికి మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి అధినేత సుముఖంగా లేరని సమాచారం. దీనివల్ల వారిలో అసంతృప్తి ఉంటుందని తెలిసినా.. జగన్ మాత్రం తాను అనుకున్నదే చేస్తారంటున్నారు విశ్లేషకులు.

ఇక ప్రస్తుత మంత్రుల్లో ఆదిమూలపు సురేశ్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. దీంతో తనకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా సురేశ్ కు మరో ఛాన్స్ ఇవ్వడంపై బాలినేని అలిగినట్లు వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కర్నూలులో జయరాంతోపాటు మరో మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులను మళ్లీ కొనసాగించే అవకాశాలే ఎక్కువ. అధినేత ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇటు కొత్తగా ఎవరెవరికి అవకాశం వస్తుందని చూస్తే.. కృష్ణా జిల్లాలో జోగి రమేశ్, మొండితోక జగన్మోహన్ రావులకు ఇప్పటికే మంత్రిపదవులపై హామీ లభించినట్లు సమాచారం. గుంటూరులో విడదల రజని, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాలో కొండేటి చిట్టిబాబులకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు అన్నదానిపై ఈనెల 10వ తేదీ వరకు గోప్యత పాటించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap cabinet
  • ys jagan
  • ysrcp

Related News

    Latest News

    • ‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

    • చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

    • కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

    • హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

    • Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్

    Trending News

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

      • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

      • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

      • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd