AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
AP Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మొదటగా నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా పడింది
- By Sudheer Published Date - 04:10 PM, Thu - 30 October 25
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మొదటగా నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి (CS) కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ మార్పును గమనించి, కొత్త తేదీ ప్రకారం తమ అజెండాలను సిద్ధం చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మొంథా తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ పర్యటనలో ఉండటమే భేటీ వాయిదా పడటానికి కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో అమలైన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొన్ని సవరణలు అవసరమని, ప్రజల నుండి సూచనలు అందాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అదే సమయంలో, నవంబర్ మధ్యలో విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై కూడా ఈ భేటీలో సమీక్ష జరగనుంది. విదేశీ కంపెనీల పెట్టుబడులు, పరిశ్రమల ప్రోత్సాహక పథకాలు, కొత్త ఆర్థిక విధానాల రూపకల్పన వంటి అంశాలు చర్చకు వస్తాయని సమాచారం.
Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంతంటే !!
తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే సీఎం చంద్రబాబు నష్టపరిహార చర్యలపై సమీక్ష జరిపి, తదుపరి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, మౌలిక వసతులు, విద్యుత్ సరఫరా, రోడ్లు వంటి విభాగాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించబడతాయని అంచనా. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గం వాయిదా పడ్డా, ఈ భేటీ మరింత విస్తృతమైన అజెండాతో జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఇప్పటికే సిద్ధతలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.