HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >War Effect On India

యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి

  • Author : Sudheer Date : 03-03-2026 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
War Effect On India
War Effect On India

War Effect On India : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండుతుండటంతో, దేశీయంగా ఇంధన ధరలు ఏ రేంజ్ లో పెరుగుతాయనే ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొనడం మార్కెట్లను కలవరపెడుతోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకుతుందని బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, ముడిచమురు ధరలో ప్రతి ఒక డాలర్ పెరుగుదల భారత ప్రభుత్వంపై ఏటా రూ. 13,000 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది.

హార్ముజ్ జలసంధి ముప్పు – రవాణా స్తంభన

భారతదేశానికి ముడిచమురు సరఫరా అయ్యే మార్గాల్లో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) అత్యంత కీలకమైనది. భారత్ రోజువారీగా వాడే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండటంతో ఈ సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ జలసంధి గనక పూర్తిగా మూతపడితే, భారత్‌కు చమురు సరఫరా నిలిచిపోయి తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం మన వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించినప్పటికీ, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ధరల పెరుగుదలను అడ్డుకోవడం కష్టతరం కావచ్చు.

వంట నూనెలు, ఎరువులపై యుద్ధ ప్రభావం

ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు, జూన్ నెలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల కొరత కూడా వేధించే అవకాశం ఉంది. ఎరువుల తయారీలో వాడే సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ దిగుమతుల్లో 76 శాతం వాటా ఖతార్, యూఏఈ, ఒమన్‌లదే. యుద్ధం వల్ల ఈ సరఫరా గొలుసు దెబ్బతింటే, ఎరువుల ధరలు పెరిగి రైతాంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Israel-Iran War
  • Israel–Iran War Impact India
  • us
  • war
  • War Effect On India

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd