Murder Case : విశాఖలో దారుణం.. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని హత్య చేసిన తండ్రి
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, నేరాన్ని అంగీకరించాడు. తమ పొరుగున...
- By Prasad Published Date - 08:16 AM, Sun - 6 November 22
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, నేరాన్ని అంగీకరించాడు. తమ పొరుగున నివసిస్తున్న వ్యక్తితో తన కుమార్తె ప్రేమించడం నచ్చకపోవడంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు వర ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు అంబులెన్స్ డ్రైవర్ అయిన ప్రసాద్ తన కుమార్తెకు పాఠశాల పుస్తకాలు, ఇతర వస్తువులు అడిగినవన్నీ ఇచ్చాడు. ఆ వ్యక్తితో మాట్లాడవద్దని కూడా అతను హెచ్చరించాడు, కానీ ఆమె వినలేదు. దీంతో వరప్రసాద్ తన కుమార్తెను హత్య చేశారు. వైజాగ్ సిటీ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రసాద్ తన కుమార్తెను బెల్టుతో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తాను చేసిన నేరాన్ని అంగీకరించిన వీడియోను రికార్డు చేశాడు. ప్రసాద్ భార్య 13 ఏళ్ల క్రితం వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు విచారణలో తేలింది. రెండేళ్ల క్రితం అతని పెద్ద కూతురు కూడా ఓ వ్యక్తితో వెళ్లిపోయి అతనితో కలిసి జీవిస్తోంది. ఇప్పుడు చిన్న కూతురు కూడా అదే ప్రయత్నం చేయడంతో తన కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.