HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amid Talk Of Alliance Pawan Kalyan Meets Chandrababu Naidu

Pawan Kalyan meets Chandrababu: ఏపీలో అరాచక పాలన.. భేటీ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు.!

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)తో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. విశాఖపట్నంలో తనని.. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు.

  • Author : Gopichand Date : 08-01-2023 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Resizeimagesize (1280 X 720) 11zon

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)తో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. విశాఖపట్నంలో తనని.. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1పై ఎలా పోరాడాలో అనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, చంద్రబాబు హక్కులను కాలరాయడంపై పవన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం పెంచడానికి ఏం చేయాలి. కుప్పంలో జరిగిన ఘటనపై చంద్రబాబును పరామర్శించాను. నేను వారాహి కొనుక్కుంటే మీకేం ఇబ్బంది. మీరు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి వెహికల్స్ కొనుక్కోవచ్చు. నేను బ్యాంకులో లోన్ తీసుకొని వారాహి కొనుక్కున్నాను. ప్రచార వెహికల్ తీసుకోవడం సహజం. నేను బయట అడుగుపడితే వైసీపీ నాయకులకు ఎందుకంత భయం అని పవన్ ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పొత్తులు సహజం అన్నారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. అదే పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారి ఏపీలోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీంతో ఎన్నికల్లో సమయంలో చాలా పొత్తులు ఉంటాయన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాశనం చేయడమే వైసీపీ అజెండా అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జీవో నెంబర్ 1 ద్వారా వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో ఏపీ ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు అని ఆరోపించారు. వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలని చంద్రబాబు ఆరోపించారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతామని వివరించారు.

Also Read: Thick Fog Covers North India: ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. ఆలస్యంగా రైళ్లు, విమానాలు

అంతకముందు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కల్యాణ్ చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లగానే అక్కడి పరిసరాలను చూసి పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయారు. గోడలు, గార్డెన్ ఆసక్తిగా చూస్తూ పలు ప్రశ్నలు అడిగారు. దానికి చంద్రబాబు కూడా బదులిస్తూ ఆ వివరాలను వెల్లడించారు. మరోవైపు తన ఇంటికి వచ్చిన పవన్‌ను చంద్రబాబు గేటు వరకు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.

వైసీపీ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జనసేనను టీడీపీలో కలిపేయాలి. చంద్రబాబు దగ్గర పవన్‌ ఊడిగం చేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌కు నైతిక విలువలు లేవు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు 175 గెలుస్తుంది అని అన్నాడు. పవన్ కళ్యాణ్- చంద్రబాబు భేటీపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్ వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మామూళ్ల కోసం దత్తత తండ్రి దగ్గరకు దత్త పుత్రుడు వెళ్లాడు అంటూ ట్వీట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chandrababu naidu
  • hyderabad
  • Janasena
  • Pawan Kalyan
  • Pawan Kalyan meets Chandrababu
  • tdp
  • ysrcp

Related News

Christmas Holidays 2025 Sch

విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ

  • Janasena Meetting

    డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • Pawan Gift

    ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Latest News

  • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

  • వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

  • దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్

  • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd