Blast in Mali : జిహాదీ తిరుగుబాటుదారుల బస్సు లక్ష్యంగా భారీ పేలుడు…11 మంది మృతి.. 53 మందికి గాయాలు..!!
మాలిలో భారీ పేలుడు సంభవించింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా... 53 మంది గాయపడ్డారు.
- Author : hashtagu
Date : 14-10-2022 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
మాలిలో భారీ పేలుడు సంభవించింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా… 53 మంది గాయపడ్డారు. సెంట్రల్ మాలిలో గురువారం బస్సులో పేలుడు సంభవించిందని AFFI వార్తా సంస్థ వర్గాలు తెలిపాయి. మోప్టి ప్రాంతంలోని బండియాగరా, గౌండ్కా మధ్య రహదారిపై గురువారం మధ్యాహ్నం బస్సులో పేలుడు సంభవించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. జిహాదీల హింసాకాండకు కేంద్రంగా పేరొందిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం బస్సులో ఉన్నవారంతా సాధారణ పౌరులు. ఒక దశాబ్దానికి పైగా, మాలి సాయుధ తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను నియంత్రించడానికి పోరాడుతోంది. మాలిలో జిహాదీ తిరుగుబాటుదారులు ఇప్పటివరకు వేలాది మందిని చంపారు.
A bus blast in Mali has killed at least 11 people and injured dozens more, according to a hospital source. The bus hit an explosive device in the Mopti area, known as a hotbed for jihadist violence: AFP
— ANI (@ANI) October 14, 2022