Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్
కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
- Author : Praveen Aluthuru
Date : 22-01-2024 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Mandir: అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరాన్ని ప్రతిష్ఠించడంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా తన అసమ్మతిని తెలియజేసింది. కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మసీదు కూల్చివేతకు బాధ్యులైన వారిని తప్పించడమే కాకుండా దాని స్థానంలో ఆలయాన్ని నిర్మించేందుకు కూడా భారత న్యాయవ్యవస్థ అనుమతించిందని పాకిస్థాన్ విమర్శించింది. భారతదేశంలో పెరుగుతున్న హిందూత్వ భావజాలం మత సామరస్యం మరియు ప్రాంతీయ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. రెండు ప్రధాన భారతీయ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు బాబ్రీ మసీదు కూల్చివేత లేదా రామ మందిర నిర్మించడం ద్వారా పాకిస్తాన్లోని కొన్ని భాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మొదటి అడుగుగా పేర్కొన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
శతాబ్దాల నాటి మసీదును 1992 డిసెంబర్ 6న తీవ్రవాదుల గుంపు కూల్చివేసింది. దాంతో భారతదేశ అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ నీచమైన చర్యకు కారణమైన నేరస్థులను నిర్దోషులుగా ప్రకటించడమే కాకుండా కూల్చివేసిన మసీదు స్థలంలో ఆలయ నిర్మాణానికి కూడా అనుమతించిందని ఎద్దేవా చేశారు పాక్ అధికారులు.
Also Read: Duplicate Virat Kohli : అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం