HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Indonesia Hit By Earthquake

Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం..!

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.

  • Author : Gopi Date : 16-11-2022 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Philippines
Earthquake 1 1120576 1655962963

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రాకు నైరుతి దిశలో బుధవారం ఈ భూకంపం వచ్చినట్లు తేలింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం నుంచి 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. ఆ దేశం బాలిలో G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి చివరి రోజు ఆతిథ్యం ఇచ్చింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు అందలేదు.

మరోవైపు.. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు బుధవారం ముగిసింది. ఈ రెండు రోజుల్లో అభివృద్ధి, శాంతి ఎజెండాపై చర్చించడానికి ప్రపంచ నాయకులు బాలిలో సమావేశమయ్యారు. దీంతో ఇండోనేషియా వచ్చే ఏడాది పాటు జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు అప్పగించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో అధికారికంగా జి-20 అధ్యక్ష పదవిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం భారత దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోదీ చైర్మన్‌గా స్వీకరిస్తూ అన్నారు. జి-20లోని ప్రతి సభ్యదేశాల కృషితో ప్రపంచ సంక్షేమానికి మేం దీన్ని ప్రయోజనకరంగా మారుస్తామని మోదీ చెప్పారు.

ఇండోనేషియాలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు ముగియడంతో దాని సభ్య దేశాలు కూడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ ‘జి-20 ఫలితాల పత్రం’ రూపకల్పనలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందని అన్నారు. భారత్‌కు జి-20 చైర్మన్‌ పదవి దక్కడంపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ మాట్లాడుతూ భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించడం చాలా ప్రోత్సాహకరంగా ఉందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bali
  • earthquake
  • earthquake in indonesia
  • G20
  • Indonesia
  • sumatra
  • world news

Related News

    Latest News

    • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

    • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

    • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

    • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

    • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd