55 Sailors Dead : ‘సముద్ర ఉచ్చు’కు 55 మంది చైనా సబ్మెరైనర్ల మృతి.. ఏం జరిగింది ?
55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది.
- By Pasha Published Date - 12:48 PM, Wed - 4 October 23
55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది. ఆ ఉచ్చులో చిక్కుకొని చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’లోని మొత్తం 55 మంది సిబ్బంది బలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 21న ఉదయం 8:12 గంటలకు చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో ఈ ప్రమాదం జరిగిందని బ్రిటన్ ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై బ్రిటన్ మీడియాలో సంచలన కథనాలు పబ్లిష్ అయ్యాయి. అయితే ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ జరగలేదని తేల్చి చెప్పింది. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. చైనా సబ్ మెరైన్ సముద్రం లోపల ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత.. దాని సిస్టం ఫెయిలైంది. ఆ సబ్ మెరైన్ కు మరమ్మతులు చేసి ఉపరితలానికి తీసుకురావడానికి దాదాపు 6 గంటల టైం పట్టింది. అప్పటికే సబ్ మెరైన్ లోని ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు పనిచేయడం ఆపేశాయి. ఆక్సీజన్ సరఫరా వ్యవస్థ స్తంభించడంతో.. దానిలోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు చనిపోయారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ప్రమాదంపై చైనా నోరు మెదపకపోవడంతో ఆ న్యూక్లియర్ సబ్ మెరైన్ నుంచి ఏవైనా అణు పదార్థాలు సముద్రంలోకి లీకయ్యాయా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్ సబ్మెరైనర్లు ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సబ్మెరైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే చైనాకు చెందిన క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. అక్కడికి అమెరికా, బ్రిటన్ జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఈ ట్రాప్ ను ఏర్పాటు చేసింది. దానికి చైనాకే చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’ చిక్కడంతో ఈ విషాద ఘటన సంభవించింది.
Also read : TDP : వారాహిలో అల్లర్లు సృష్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.. వైసీపీకి టీడీపీ నేత యరపతినేని హెచ్చరిక
ఈ ప్రమాదం జరిగిన రోజునే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం నుంచి హఠాత్తుగా వైదొలిగారు. ఈ క్రమంలో చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వాక్వింగ్ అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని సదస్సుకు చదివి వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సబ్మెరైన్ ప్రమాద వివరాలు తెలియడంతోనే (55 Sailors Dead) జిన్పింగ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు.
Tags
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.