4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు.
- By Gopichand Published Date - 11:45 AM, Fri - 30 December 22
క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు. సమాచారం ప్రకారం.. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో సింఫెరోపోల్ వైపు వెళ్తున్నారు. అయితే అకస్మాత్తుగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.
Also Read: Hindu Woman Killed: పాకిస్థాన్లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు
నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన కేసును పోలీసులు విచారిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో క్రిమియాలోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
Related News
Indian Military: మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చేసిన భారత సైనికులు..!
మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. మాల్దీవుల ప్రభుత్వం శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.