HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Ceo Shares Sale Proceeds With Employees

సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.

  • Author : Gopichand Date : 26-12-2025 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CEO
CEO
  • అమెరికాలోని ఆశ్చ‌ర్య‌పోయే ఘటన
  • 540 మంది ఉద్యోగులకు రూ.2,155 కోట్లు ఇచ్చిన సీఈవో
  • ఉద్యోగుల కోసం లాభాల్లో వాటా

CEO: సాధారణంగా ఏదైనా కంపెనీ భారీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ లాభాలు కేవలం ప్రమోటర్లకు లేదా ఇన్వెస్టర్లకు మాత్రమే అందుతాయి. కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ అనే ఫ్యామిలీ బిజినెస్ సీఈఓ గ్రాహం వాకర్, తన కంపెనీని విక్రయించిన తర్వాత వచ్చిన లాభాల్లో తన ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి ఆదర్శంగా నిలిచారు.

ఉద్యోగుల కోసం రూ. 2155 కోట్లు

కంపెనీ విక్రయం ద్వారా తనకు అందే మొత్తంలో 15 శాతం వాటాను తన వద్ద పనిచేస్తున్న 540 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు పంచాలని గ్రాహం నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం సుమారు 240 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2,155 కోట్లు (21 బిలియన్ల 55 కోట్లు).

Also Read: న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

డీల్- బోనస్ వివరాలు

ఫైబర్‌బాండ్ కంపెనీని అమెరికన్ దిగ్గజ సంస్థ Eaton కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో గ్రాహం ఒక కీలక షరతు పెట్టారు. కంపెనీ అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని కోరారు. కంపెనీలో షేర్లు లేని ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తింపజేయడం విశేషం. ఈ బోనస్ చెల్లింపులు జూన్ 2025 నుండి ప్రారంభమయ్యాయి.

ఒక్కో ఉద్యోగికి ఎంత వస్తుంది?

ఈ లెక్కన సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 4 లక్షల 43 వేల డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 3.7 కోట్లు) అందుతాయి. అయితే ఈ మొత్తం ఒకేసారి ఇవ్వబడదు. వచ్చే 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఈ నగదును అందజేస్తారు. అయితే, ఈ బోనస్ పొందాలంటే సదరు ఉద్యోగి కంపెనీలోనే కొనసాగాలనే నిబంధన ఉంది.

సీఈఓ ఏమన్నారంటే?

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు. ఈ వార్త విన్నప్పుడు చాలా మంది ఉద్యోగులు మొదట నమ్మలేకపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్రాహం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో అత్యంత సానుకూలమైన వార్తల్లో ఒకటిగా నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • ceo
  • CEO Loyalty To Employees
  • employees
  • Fiberbond

Related News

Hcltech

HCLTech : ఐఐటీ కాన్పూర్ తో డీప్ టెక్ ..సాంకేతిక రంగంలో ఓ మైలురాయి

హైదరాబాద్‌లో జరిగిన ‘GCC 4.0’ సదస్సులో ఈ ఒప్పందానికి పునాది పడటం విశేషం. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వివరించినట్లుగా, ఈ భాగస్వామ్యం అకాడమిక్ పరిశోధనలకు మరియు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అతిపెద్ద అంతరాన్ని తగ్గిస్తుంది

  • Bank Holidays

    మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

  • Income Tax

    ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • PM Kisan

    పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

  • Gold- Silver

    ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

Latest News

  • Kajjikaya Police Complaint Issue : కజ్జికాయలు పెట్టలేదని అత్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన అల్లుడు

  • Adulterated Ghee : హైదరాబాద్‌ హోటళ్లలో కల్తీ నెయ్యి..వెలుగు సంచలన నిజాలు

  • Rashmika – Vijay Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?

  • Student Gives Birth : బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని ప్రసవం

  • Flight Accident : బొలీవియా లో ఘోర విమాన ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd