HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Ceo Shares Sale Proceeds With Employees

సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.

  • Author : Gopichand Date : 26-12-2025 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CEO
CEO
  • అమెరికాలోని ఆశ్చ‌ర్య‌పోయే ఘటన
  • 540 మంది ఉద్యోగులకు రూ.2,155 కోట్లు ఇచ్చిన సీఈవో
  • ఉద్యోగుల కోసం లాభాల్లో వాటా

CEO: సాధారణంగా ఏదైనా కంపెనీ భారీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ లాభాలు కేవలం ప్రమోటర్లకు లేదా ఇన్వెస్టర్లకు మాత్రమే అందుతాయి. కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ అనే ఫ్యామిలీ బిజినెస్ సీఈఓ గ్రాహం వాకర్, తన కంపెనీని విక్రయించిన తర్వాత వచ్చిన లాభాల్లో తన ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి ఆదర్శంగా నిలిచారు.

ఉద్యోగుల కోసం రూ. 2155 కోట్లు

కంపెనీ విక్రయం ద్వారా తనకు అందే మొత్తంలో 15 శాతం వాటాను తన వద్ద పనిచేస్తున్న 540 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు పంచాలని గ్రాహం నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం సుమారు 240 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2,155 కోట్లు (21 బిలియన్ల 55 కోట్లు).

Also Read: న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

డీల్- బోనస్ వివరాలు

ఫైబర్‌బాండ్ కంపెనీని అమెరికన్ దిగ్గజ సంస్థ Eaton కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో గ్రాహం ఒక కీలక షరతు పెట్టారు. కంపెనీ అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని కోరారు. కంపెనీలో షేర్లు లేని ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తింపజేయడం విశేషం. ఈ బోనస్ చెల్లింపులు జూన్ 2025 నుండి ప్రారంభమయ్యాయి.

ఒక్కో ఉద్యోగికి ఎంత వస్తుంది?

ఈ లెక్కన సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 4 లక్షల 43 వేల డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 3.7 కోట్లు) అందుతాయి. అయితే ఈ మొత్తం ఒకేసారి ఇవ్వబడదు. వచ్చే 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఈ నగదును అందజేస్తారు. అయితే, ఈ బోనస్ పొందాలంటే సదరు ఉద్యోగి కంపెనీలోనే కొనసాగాలనే నిబంధన ఉంది.

సీఈఓ ఏమన్నారంటే?

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు. ఈ వార్త విన్నప్పుడు చాలా మంది ఉద్యోగులు మొదట నమ్మలేకపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్రాహం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో అత్యంత సానుకూలమైన వార్తల్లో ఒకటిగా నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • ceo
  • CEO Loyalty To Employees
  • employees
  • Fiberbond

Related News

GST

ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!

పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.

  • 2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?

  • Gold vs Silver

    2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

  • Now there are commercials on ChatGPT too!

    ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!

  • Canara Bank launches UPI app 'Canara AI 1Pay'

    ‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్‌ను విడుదల చేసిన కెనరా బ్యాంక్

Latest News

  • బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!

  • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

  • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

  • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

  • రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

Trending News

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd