Anand Mahindra: వర్షం పడుతున్న సమయంలో అలాంటి పని చేసిన వృద్ధ జంట.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్?
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆనంద్ మహీంద్రా.
- By Nakshatra Published Date - 04:26 PM, Mon - 3 July 23
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోస్ వీడియోస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూ రీ ట్వీట్ చేస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక వృద్ధా జంటను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కాగా 1979లో అమితాబ్ బచ్చన్, మౌషుమి నటించిన మంజిల్ బాలీవుడ్ సినిమా లోని రిమ్జిమ్ గిరే సావన్ పాట ఎంతో మందిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
సినిమాలోని పాటకి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన కూడా లభించింది. ఈ పాటలో ఇద్దరూ కలిసి వర్షంలో ముంబయి అంతా తిరుగుతూ కనిపిస్తారు. అచ్చం అలాగే ఒక వృద్ధ జంట పాటలో ఉన్నట్లుగా దుస్తులు ధరించి అవే లోకేషన్లలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని వర్షంలో తిరుగుతూ కనిపించారు. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ పాటలో కనిపిస్తున్న ఒక వృద్ధ జంట ప్రముఖ పాటను గుర్తు చేశారు. సినిమాలోని అవే లోకేషన్ లలో తిరుగుతూ అచ్చం అలాగే కనిపించారు.
This is justifiably going viral. An elderly couple re-enact the popular song ‘Rimjhim gire sawan’ at the very same locations in Mumbai as in the original film. I applaud them. They’re telling us that if you unleash your imagination, you can make life as beautiful as you want it… pic.twitter.com/wO7iJ3da3m
— anand mahindra (@anandmahindra) July 2, 2023
వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మీ ఆలోచనలను బయటపెడితే.. మీరు కోరుకున్న జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చు అని వారు ఈ వీడియో ద్వారా చెబుతున్నారు అంటూ ప్రశంసించారు ఆనంద్ మహీంద్రా. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Related News
Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి
ముంబైలో తీవ్ర విషాదం నెలకొంది. భాండూప్లోని సుష్మా స్వరాజ్ పాలికా ప్రసూతి గృహంలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రసవ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాష్లైట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు