WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!
ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది
- By Balu J Published Date - 02:08 PM, Wed - 16 August 23
కరోనా నుంచి ఉపశమనం పొందామని అనుకునేలోపు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది. ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. ఈ వేరియంట్ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని తెలిపింది. ఈజీ-5.. ఒమిక్రాన్ ఉత్పరివర్తన అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
ప్రస్తుతం అమెరికాలోనూ ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లోకి కూడా ఈ వేరియంట్ ఎంటరైందని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయని చెప్పారు. అయితే, ఇప్పటికి రెండు నెలలు గడిచినా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించకపోవడం కొంత ఊరటేనని వివరించారు. అయితే, వైరస్ లక్షణాల్లో తీవ్రత పెద్దగా కనిపించలేదని, బాధితులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని వివరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ లో కలిగిన జన్యుమార్పులతోనే ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ బాధితుల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలే కనిపిస్తాయని వివరించారు. ముక్కుకారడం, తుమ్ములు, విపరీతమైన తలనొప్పి, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.
Also Read: Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!
Tags
Related News
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.